27 నవం, 2009

ఆర్య 2 అంతంత మాత్రమే


నిన్న ఆర్య 2 ప్రిమియర్ షో కి వెళ్ళడం జరిగింది . నా కైతే సినిమా నిరాశ పరిచింది .ఆర్య లో ఉన్నంత గ్రిప్ యి సినిమాలో లేదు . కధ టూకీగా ఇద్దరు అనాధలు స్నేహితులు . వాళ్ళలో వొకన్ని గొప్పింటి వాడు దత్తత తీసుకుందామని వస్తే ఆర్య త్యాగం చేసి స్నేహితుడికి ఆ అవకాశం ఇప్పిస్తాడు .ఆ అవకాశం పొందిన అజయ్ , అర్యని ఎప్పుడు శత్రువు లాగే భావిస్తాడు .పెద్ద అయ్యాక అజయ్ కంపని లోనే జాయిన్ అయ్యి ఇద్దరు వొకే అమ్మాయిని ప్రేమించడం , వోకల్ల మీద వోకల్లు కుయుక్తులు పన్నుకుని ఆమె ప్రేమని పొందడానికి ప్రయత్నించడం ., వొక సందర్భం లో ఆర్య రాయల సీమ factionist అయిన హీరోయిన్ తండ్రి దగ్గరకి వెళ్లి , ప్రత్యేకమైన పరిస్తితుల్లో ఆమెని పెళ్లి చేసుకుని కుడా స్నేహితుడి కి ఆమెని అప్పగించి సాక్రిఫైస్ చెయ్యడానికి సిద్ద పడి , మళ్ళి కుయుక్తి పన్ని అజయ్ మీద ద్వేష భావం ఏర్పరచి హీరోయిన్ ని తన దాన్ని గా చేసుకోవడం .
ఏంటో డైరెక్టర్ తికమక కి గురి అయ్యి ప్రేక్షకుల్ని కూడా దానికి గురి చేసాడేమో అని పించింది . కాసేపు హీరో ని సైకో గా చూపిస్తూ మళ్ళి కాసేపు మంచి వాడి గా చూపిస్తూ , climax లో కూడా తనని చంపడానికి అజయ్ ప్రయత్నించినట్టు హీరోయిన్ అనుకునేలా చెయ్యడం హీరో పాత్రని ఎలివేట్ చెయ్యదు .డాన్సులు చాల కష్ట పడి చేసాడు అల్లు అర్జున్ .రింగా రింగా పాట కాంట్రవర్సీ ని చేరపడనికేమో సినిమాలోలిరిక్ కొంత మార్చారు .గుత్తి తీసేసి కంచే అని పెట్టారు . బ్రహ్మానందం ని యి మద్య ఊరికే పెట్టుకుంటున్నారు గాని హాస్యం పండించడానికి మంచి పాత్రని ఇవ్వటం లేదు . యి సినిమాలో కూడా అంతె .నవదీప్ , అర్జున్ ఇద్దరు విలన్ లాగే బిహావ్ చేస్తారు . ఇంక బొమ్మ గుడ్డ కప్పిన కార్ నడపడం అది హీరోయిన్ ని ఏదన్నా అన్నవాడి వెంట పడడం అస్సలు పండలేదు . వోకో సారి విసుగ్గా అని పిస్తుంది ఇంకా అవదేంటి అని .ఓవర్ అల్ గా ఆర్య 2 అంతంత మాత్రమే .యూత్ దయ తలిస్తే గట్టేక్కొచ్చు .

25 నవం, 2009

ఎవరి కోసం ఎవరు ?


యి రోజు ఆఫీసు లో స్టాఫ్ చాల లేట్ గా పదకొండు దాటాక వచ్చారు నిన్న election డ్యూటీ కి వెళ్ళిన వాళ్ళంతా .అందులో ఎక్కువ మంది ఆడవాళ్లే .కారణం తెలుసున్నా గాని అధికార రీత్యా ఎందుకు ఆలస్యం అయ్యింది అని అడిగా (muster మాత్రం ఇంకా క్లోజ్ చెయ్యలేదు ) ఎప్పుడు సౌమ్యం గా హుందాగా వుండే ఆ అమ్మాయి లో ఆవేశం కట్టలు తెంచుకుంది .సర్ ఎన్నికల డ్యూటీ ని మాత్రం ఇక నుంచి ఆడవాళ్ళకి వెయ్యకండి (నిజానికి నా ప్రమేయం లేకుండా కింద వాళ్ళే పంపేసారు ,ఎన్నికల సంఘం నుంచి అవే పేర్లు డ్యూటీ వేస్తూ వచ్చేసాయి ) నిన్న పొద్దున్న అయిదు గంటలకి వెళ్ళిన వాళ్ళం evm లు స్టేడియం లో అంద జేసి ఇంటికి జేరే సరికి అర్దరాత్రి దాటి పోయింది .పొద్దున్న మా వారు ప్యాక్ చేసి ఇచ్చిన సాండ్ విట్చ్ తోనే రోజంతా గడప వలసి వచ్చింది .టోలి చౌకి పోలింగ్ కేంద్రం లో నే వొక్క దాన్నే ఆడ ఆమెని .తినడానికి తిండి లేదు , తాగడానికి నీళ్ళు లేవు , బాత్రూం కి వెళదామంటే ఆ సౌకర్యం కూడా లేదు .పోనీ డబ్బులు ఇచ్చి బయట కొనుక్కున్దామంటే అన్ని బంద్ .విధులు నిర్వహించే మేము కాసేపు ఆపేసి వొకరి తర్వాత వోకరన్న పోయి అరటి పళ్ళు కొనుక్కుని వద్దామనుకున్నా బురఖాలు వేసుకుని ఆడవాళ్ళ పెద్ద que లు అక్కడ agents మా ఆడవాళ్ళ వేలు మగ వాళ్ళు పట్టుకోకూడదు మీరే చుక్క పెట్టాలని కదల నివ్వ లేదని చెప్పింది .సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టించారు మేము ఎలా ఉన్నామో అని మా కుటుంబ సబ్యుల ఆదుర్దా రాత్రి వరకు అంటూ కళ్ళలో నీళ్ళు పెట్టుకుని చెప్పింది .
కనీస వసతులు కూడా కల్పించ లేదు రాష్ట్ర ప్రబుత్వం .అర్దరాత్రి స్టేడియం నుంచి ఆడవాళ్ళూ తమ ఇళ్ళకి ఏ ట్రాన్స్పోర్ట్ provide చెయ్యక పొతే ఎలా వెళతారు? రెండు బ్రెడ్ ముక్కలతో ఉదయం నుంచి అర్దరాత్రి దాక బాత్ రూం కి కూడా పోకుండా , కుటుంబ సబ్యుల తో కుడా కాంటాక్ట్ లో లేకుండా , ఇంటికి తిరిగి రావడానికి ట్రాన్స్పోర్ట్ లేకుండా ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకునే కార్య క్రమం లో భాగస్వాములు అయిపోవాలి .
ఎన్నికల agent గా వున్న వాళ్ళకి పార్టీ లు వోక్కోకరికి అయిదు నుంచి పది వేలు ఇచ్చారట . వాళ్ళు వంతుల వారి గా డ్యూటీ లు చేసి చక్కగా తిని వచ్చేవారు .వోకో అభ్యర్ది 50 లక్షలకి తక్కువ ఖర్చు పెట్టలేదు .ఇంత ఖర్చు పెట్టి రేపు చేతులు ముడుచుకు కుర్చోడు కదా.అంటే రేపటి ఆయన సుఖం కోసం , కొన్ని వందల మంది ఉద్యోగులు యి రోజు కష్ట పడాలి . రేపు అదే ప్రజా ప్రతినిధి మీటింగ్స్ లో అధికార్లని బండ బూతులు తిడుతున్నా భరించాలి .ఇక్కడంతా ఎవరి కోసం ఎవరు పని చేస్తున్నారో అర్ధం కాదు .
మిగత స్టాఫ్ కూడా అదే టైం కి వచ్చి వాళ్ళు పడ్డ బాధలు చెప్పుకున్నారు .ఇంతకీ మా ఆఫీసు లో అలా బాధ పడ్డ ఆమె వొక సిట్టింగ్ సీనియర్ ఏం ఎల్ ఏ కోడలు .ఆమె దుఖం ఆపుకోలేక సర్ నెక్స్ట్ టైం మీరు మమ్మల్ని యి డ్యూటీ నుంచి తప్పించక పొతే మా మావగారు కేంద్ర మంత్రి నుంచి సిఫారసు చేయిస్తా నన్నారు అనేసింది .నిజమే సరైన సదుపాయాలు వున్నాయని నిర్దారించు కున్నాకే యి సారి మా స్టాఫ్ ని రిలీవ్ చెయ్యాలని నిర్ణ ఇంచుకున్నా .

22 నవం, 2009

పొరుగింటి పుల్లకూర


నిన్ననే 2012 సినిమా చూసా. మూడు రోజుల్లోనే వెయ్యి కోట్లు పైగా వసూల్ చేసిందంటే ఆశ్చర్యం వేసింది .భూకంపం వస్తుంటే కార్ దుసుకుంటూ పోతూ వుంటుంది .ఆ కార్ వున్న ప్రాంతం తప్ప మిగత చోట్ల భూమి చీలి పోతూ వుంటుంది .రోడ్ రెండు గా చీలి పోయి అఘాధం లా వస్తే హీరో కార్ ని జుంప్ చేసి అవతల పక్కకి తీసుకు పోతాడు .ఇంక చిన్న విమానం లో పారి పోయే సన్నీ వేసాల్లో లాజిక్ అన్న పదం ఉండనే వుండదు . ఇలాంటి హెలికాఫ్టర్ లో రైల్ ని చేజ్ చేస్తోనో , విలన్ గ్యాంగ్ హీరో ని చేజ్ చేస్తోనో , బాలకృష్ణ , చిరంజీవి ల సినిమాల్లో వస్తే తెలుగు ప్రేక్షకులు వెర్రి వెదవల్ల కన బడుతున్నారు ,చెవిలో పువ్వులు పెట్టుకుని చూడాలి ఇలాంటి తెలుగు సినిమాలు అనుకుంటూ reject చేస్తాం .
అదే విదేశీయులు కోట్లు కుమ్మరించి ఇదే సన్నివేశాన్ని తెరకెక్కిస్తే నోరు వెల్ల బెట్టి చూస్తాం .వొక పక్క తమ్మారెడ్డి భరద్వాజ లాంటి దర్శకులు తెలుగు లో దమ్మున్న మగాళ్ళు లేరు అని statements ఇచేస్తారు .దశావతారం లో కమల్ థీమ్ కి దీనికి తేడ నాకు పెద్దగా కని పించలేదు .ఎటొచ్చి యీ సినిమా విడుదల కి ముందు గానే నిజంగా యుగాంతం జరగ బోతోందా అంటు టీవీ లలో చర్చలు ,sms లు అంటు పిచ్చ హైప్ ఇచ్చివీలై నన్ని ప్రింట్స్ తో రిలీజ్ చేసుకుని డబ్బంతా మొదటి వారం లోనే రాబట్టు కోవడం యీ మద్య మొదలైన కొత్తట్రిక్ .యీ మద్య మీరు గమనిస్తే విడుదల కి ముందే ఏదో వొక కాంట్రవర్సి రగులుస్తూ , ఆ సినిమాకి విపరీతమైన ప్రచారం కల్పిస్తూ ,మాగ్జిమం ప్రింట్స్ తో విడుదల చేస్తే చాలు మొదటి వారం లో నే పైసా వసూల్. దియేటర్ లోకి జనాల్ని రప్పించడానికి ఇదో కొత్త పద్దతి .సినిమా బావుంటే ఆటోమాటిక్ గా హిట్ అవుతుంది లేదంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి మొదటి వారం లో నే వచేస్తాయి .మగధీర నుంచి రేపు రాబోయే ఆర్య 2 దాక ఇలా వివాదాల లోకి లాగడమే .
ఇంకో జోక్ ఏంటంటే ఇన్ని కోట్లు పబ్లిసిటీ కి ఖర్చు పెట్టి 2012 ని విడుదల చేస్తే అదే సమయానికి హైదరాబాద్ లో 2010 అని ఇంకో సినిమా విడుదల చేస్తే చాల మంది confuse అయ్యి దానికి వెళ్లి బకరా అయిన వాళ్ళు వున్నారు . అసలు యీ సినిమాకి వెళ్ళడమే పెద్ద బకరా .యీ సినిమా చూడడమే పెద్ద స్టేటస్ సింబల్ గా తయారయ్యింది పిల్లలలో , దాంతో పెద్దలు కూడా తయారు .వొక్క ముక్కలో చెప్పాలంటే ఇది పొరుగింటి పుల్ల కూర . తెలుగు లో లాగే అక్కడక్కడ తండ్రి కూతురు సెంటిమెంట్ , విడిపోయిన ప్రియుడి సెంటిమెంట్ లాంటివి కూడా దట్టించారు .
అనట్టు ఇప్పుడే తెలిసిన వార్త నిజంగానే కలియుగం 2090 లో అంతం కాబోతోంది .అయితే ఇది రాసిన నాకు గాని చదివే మీకు గాని దాని వాళ్ళ జరిగే నష్టం సున్నా .ఎందుకో ప్రత్యేకం గా నేను చెప్పాలా?

15 నవం, 2009

మేకింగ్ అఫ్ ''విలేజ్ లో వినాయకుడు''







వెయ్యి మాటల ద్వార చెప్ప గలిగేది వొక్క ఫోటో తో చేపోచ్చని అనిపించి'' విలేజ్ లో వినాయకుడు'' షూటింగ్ ఫొటోస్ ఇక్కడ పెడుతున్నా . సినిమా చూసిన వాళ్ళకి ఏ సీన్ లో ఫోటోసో వెంటనే స్ఫురణకు వస్తాయి .మీలో కొంతమందైనా యి సినిమా చూసి మీ విలువైన అభిప్రాయం తెలియ బరిచే దాక ఇలానే వాయించ దలచు కున్నా .కొంచెం పెద్ద హృదయం చేసుకుని , సుజాత గారి లా చూసేసి కామ్ గా వుండకుండా రాయో , పువ్వో విసిరేయ ప్రార్దన .

14 నవం, 2009

బిగ్ ఎఫ్ ఏం లో బాలల దినోత్సవం ఫోటోలు




సినిమాల్లో వేసిన బాల నటులతో యి రోజు 92.7 బిగ్ ఎఫ్ ఏం వాళ్ళువొక ప్రోగ్రాం నిర్వహించారు . విలేజ్ లో వినాయకుడు లో వేసిన మా అబ్బాయికి కూడా ఆహ్వానం అందడం తో వెళ్ళాడు . ఆ సందర్భంగా తీసిన ఫొటోస్.ఇక్కడైతే సేఫ్ గా పడి వుంటాయని ,మంచు లక్ష్మి (మోహన్ బాబు daughter )తో ఫోటో బాగా వచ్చిందని నమ్మకం తో లోడ్ చేస్తున్నా .

5 నవం, 2009

విలేజ్ లో వినాయకుడు లో నేను


ఇంతకూ ముందు నా పోస్ట్స్ లో షూటింగ్ అనుభవాలు రాసాను .ఏదో సరదాగా వేసాను కాబట్టి డబ్బింగ్ చెప్పేసాక ఆ విషయం మర్చి పోయా కుడా .నిన్న సడన్ గా యూనిట్ వాళ్ళు ఫోన్ చేసి అమీర్ పేట బిగ్ సినిమా లో ప్రివ్యూ వుంది రమ్మంటే వెళ్ళా .మొత్తం కుటుంబ సమేతంగా .(మా పిల్లలు కూడా వేసారు కాబట్టి) .సినిమా చూసాక సంతోషం వేసింది నెల్లాళ్ళు రాజోలు లో మండు టెన్డల లో కష్ట పడి నందుకు సత్ఫలితమే వచ్చింది .నేను నటించన మూడు సన్నివేశాలు కూడా ప్రేక్షకులు బానే రిసివు చేసుకున్నారు .అంతకు ముందు జోష్ సినిమాలో ప్రకాష్ రాజ్ పక్కన సూట్ వేసుకుని కూర్చున్నా , మొదటి సారి డైలాగులు చెప్పింది యి సినిమాలోనే .మా అబ్బాయి చేసిన సన్నీ వేశాలకి కూడా నవ్వులు రువ్వాయి .రేపు శనివారం ఫస్ట్ షో కి అందులో నటించిన నటీ నటులతో దేవి దియేటర్ లో ప్రేక్షకుల మద్య లో కుర్చుని చూడాలని ప్లాన్ చేసాము . ఇంతకీ నా పాత్ర ఏమై వుంటుంది అబ్బా ?ఆశ , దోస , అప్పడం , వడ అంత ఈజీ గా చెప్పేస్తే ఇంట్రెస్ట్ ఏమి వుంటుంది ?చూసి మీరే కని పెట్టండి .యి సినిమాని తప్పకుండా కుటుంబ సమేతం గా వెళ్లి చిరు నవ్వు తో చూడొచ్చని హామీ ఇస్తున్నా .

1 నవం, 2009

పిడతకంది పప్పు

మొన్ననే కాకినాడ లో చుట్టాల పెళ్ళికి వెళ్ళవలసి వచ్చింది మా అమ్మ గారి నిర్భంధం వల్ల.చుట్టూ పక్కల వున్న ద్రాక్షారామం , కోటిపల్లి , సామర్లకోట లో ప్రసిద్ధ శివాలయాల దర్సనం అయిపోయాక ఇంకా సమయం వుండడం తో వొకసారి చినప్పుడు సెలవలకి వెళ్లి గడిపిన మా అమ్మమ్మ గారి ఇంటిని చూడాలని పించింది ,చాల ఏళ్ళ క్రితమే మా అమ్మమ్మగారు పోయిన కొత్తల్లోనే ఆ ఇల్లు అమ్మేసారు .అది సూర్యారావుపేట లో దయల్బాగ్ స్టోర్స్ వీధి లో వుండేది .ఆ యింటి తో చినప్పటి జ్ఞాపకాలు చాలా వున్నాయి .
ఎదురుగుండా డాక్టర్ నారాయణ మూర్తి గారి ఇల్లు .అప్పట్లోనే అయన పేరున్న డాక్టర్ ,వాళ్ల అమ్మాయి , అబ్బాయి నా యీడు వాళ్లే రెడ్ కాన్వెంటు లో చదువుతూ వుండేవారు ,అప్పట్లో కాకినాడలో రెడ్ కాన్వెంటు , బ్లూ కాన్వెంటు ప్రసిద్ది చెందిన స్కూళ్ళు .వాళ్ళు పుట్టపర్తి సాయిబాబా భక్తులు . ప్రతి గురువారం వాళ్ళింట్లో భజనలు చేసి ప్రసాదం పంచేవాళ్ళు .సెలవలకి వెళ్ళినప్పుడు నేను భజనలకి వెళ్ళే వాణ్ణి , వొకసారి (ఆ వయసులోనే) వాళ్ల అమ్మాయిని ఇంప్రెస్స్ చేసేద్దామని నేను పాడతా అంటూ వొక పిలుపులో పిలిచితే అంటూ వెంకటేశ్వర భక్తీ గీతం అందుకుంటే వాళ్ల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడి ఏమి అనలేక భజన అయిపోయాక సాయిబాబా భజనలో వేరే పాటలు పాడాకుడదని చెప్పారు ,ఆ ఇల్లు ఇప్పటికి అదే shape లో వుంది పాతకాలపు వాసనలతో .ఆ విధి లో అప్పట్లో వాల్లోక్కరికే కార్ వుండేది . దాన్ని స్టార్ట్ చెయ్యాలంటే ముందు జెడ్ shape రాడ్ తో తిప్పేవారు .మా ఇంటి పక్కనే భానుడి గారి ఇల్లు వుండేది ఇప్పుడది మొండి గోడలతో వుండి పోయింది .దాన్ని చూసే మా అమ్మమ్మ గారి ఇల్లు గుర్తు పట్టా . ఇప్పుడు అక్కడ క్యారియర్ ఏ సి షో రూం వచ్చేసింది వొకప్పుడు పిల్లలం అంతా అక్కడే నూతి గట్టు దగ్గర , జామి చెట్ల కింద ఆడుకుంటూ వుండే వాళ్ళం . సాయంత్రం ఆరు దాటగానే వీధి బయటకు వచ్చి ఎదురు చూసే వాళ్ళం పిడత కందిపప్పు మూడు చక్రాల బండి కోసం .దూరం నుంచి గుడ్డి దీపం పెట్టుకుని బండి ని రెండు చక్రాల మీద తోసుకుంటూ వచ్చే ఆ ముసలి అబ్బి కోసం .పది పైసలకే బోల్డు ఇచ్చేవాడు .ఆ రుచి ఎప్పటికి మర్చి పోలేను , ఆ బండిని అతను గాంధి నగరం పార్క్ దాక తోసుకుని వెళ్లి అక్కడే అమ్ముకునే వాడు .నేనెప్పుడు కాకినాడ వెళ్ళిన గాంధీనగరం పార్క్ దగ్గర పిడత కంది పప్పు మిస్ అవ్వను .కార్ ని పార్క్ దగ్గరే ఆపించేసి డ్రైవర్ ని నేను వాక్ చేసి వస్తా నువ్వు బయట వుండని వెళ్లి చుట్టూ తిరిగి చుస్తే ఎక్కడ బండి కనబడ లేదు ,నిరాశగా కార్ ఎక్కుతూ యధాలాపం గా డ్రైవర్ ని అడిగా ఇక్కడ పిడతకంది పప్పు ఎక్కడ దొరుకుతుందని .అదేదో విదేశి కంది పప్పేమో సారూ అడుగుతున్నారు రిస్క్ ఎందుకని సుపెర్మర్కేట్ లో దొరకచ్చేమో బాబయ్య అంటూ నీళ్ళు నములు తున్నాడు .ఇంతలొ నా కావలసిన బండి కని పించగానే కార్ ఆపమని బండి దగ్గర కెళ్ళి పిడత కందిపప్పు కట్టమన్న నా కేసి ఎగా దిగా చూసి అటుకుల బటనీల పప్పేనా బాబయ్య అని అడుగుతున్నా బండివాన్ని అవునని తలూపి ,ఇప్పుడు ఆ పేరు ఎవరు వాడటం లేదా అన్నా ,వొకప్పుడు అటుకుల మద్యలో పిడత వేడి వేడి ధీ పెట్టి బుడ్డి దీపం వెలుగు లో అమ్మే వాడండి మా అయ్యా ఇప్పుడు అవన్నీ మారి పోయి యి బళ్ళు వచ్చేసయండి ఆయీ .అంటూ రెండు పొట్లాలు నా చేతి లో పెడితే డ్రైవర్ కి వొకటి ఇచ్చి నేనొకటి తీసుకుని తింటే అదే రుచి , అదే జ్ఞాపకం . బండి లో వున్న ఎఫ్ ఏం రేడియో నుంచి గుర్తు కొస్తున్నాయి గుర్తు కొస్తున్నాయి అంటూ వస్తున్న పాట యద్రుచ్చికమో ,బగవద్విదితమో గాని నా చుట్టూ అప్పుడు అప్పటి బాల్య స్నేహితులు , ఎదురింటి నుంచి ఆసక్తి గా గమనిస్తున్న డాక్టర్ గారి అమ్మాయి వల్లి కళ్ళ ముందు మెదిలి , కళ్ళ నుంచి ఆనంద భాష్పాలో ?అసృధారలో జల జల రాలుతుంటే కారం ఎక్కువయ్యిందా బాబయ్య అంటూ అడుగుతున్నా బండి వాడి పిలుపుతో యి లోకం లోకి వచ్చి ఇంకో రెండు పొట్లాలు అమ్మకి కూడా కట్టించుకుని భారం గా కార్ లో అడుగు పెట్ట గౌతమి కి టైం అవుతోందని .