
ఈ రోజే అరుంధతి సినిమా చూడడం జరిగింది.ఇప్పటికే సమిక్షలలో సినిమాని ఆకాశానికి ఎత్తెయ్యడం వల్ల హై expectations తో చూడడం తో కొంత అసంతృప్తి కి లోనవడం జరిగింది. అందుకే ఇంక సమిక్షించకుండా నేను కని పెట్టిన లోపాలే రాస్తాను. మొట్టమొదటి పెద్ద లోపం ఏంటంటే జేజమ్మ ఎముకలతో చేసిన కత్తి లాంటి ఆయుధం పని చెయ్యాలంటే ,ఆ పశుపతి ప్రేతాత్మ ఎవరినైనా అవహించినప్పుడే పని చేస్తుందని ఆ ఆయుధం ఇస్తునప్పుడే అఘోరి (లేదా ఆ ఋషి) చెపుతాడు. కానీ క్లైమాక్స్ లో అరుంధతి ఆ ప్రేతాత్మ నే పొడిచినట్టు చూపుతారు.అలాగే పశుపతి కొంత సేపు వేరే మనుషుల మిద అవహిస్తూ మాట్లాడి, మళ్ళి నాశనం అయిపోయిన తన పాత రూపం లో ఎలా వస్తాడో?అలాగే పకిర్ ని ప్రేతాత్మ చంపేసినట్టు గా నీళ్ళలో ములిగి పోయినట్టు గా చూపించి మళ్ళి బతికోచినట్టు గా చూపిస్తారు.
ఒక సీన్ లో 9999 నెంబర్ కార్ రైల్ గేటు దగ్గర పట్టాల మీద ఇరుక్కు పొఇ రైల్ డీ కొట్టాక మండి పోయి నట్టు గా చూపించారు మళ్ళి నెక్స్ట్ సీన్ లో అదే కార్, no తో సహా అదే ,అరుంధతి ఫ్యామిలీ హైదరాబాద్ వెళ్తునట్టు చూపిస్తారు.ఇంకో లోపం ఏంటంటే అరుంధతి ఆయుధం గా మారడం కోసం చని పోయే సీన్ లో వున్నా ముసలి అఘోరి కి అప్పటికే 70 ఏళ్ళు ,రెండో అరుంధతి మళ్ళి పుట్టి అదే రూపం లో రావడానికి 80 ఏళ్ళు పట్టినట్టు గా కధలో అర్ధం అవుతుంది అంటే ఆ ముసలాయన వయసు 150 అనుకోవాలా?ఈ సినిమా రెండు ప్రేతాత్మ ల పగ గా చెప్పుకోవచ్చు.50 కోట్లు దాక వసూల్ చేయొచ్చు అంటున్నారు ?అంత సీన్ నాకైతే కనబడలె . ఆ రోజుల్లోనే పాపం విటలచార్య ఇంత కంటే మంచి మాయల మరాటి సినిమాలు తీసినా మీడియా exposure అప్పట్లో లేదు కాబట్టి వసువుల్లలొ వెనక బడి వుండొచ్చు.కలదన్నవి కలవో ? లేవో?గాని వాటి పేరు చెప్పుకుని బాగు పడిన వారి లిస్టు లో యండమూరి తర్వాత శ్యాం ప్రసాద్ రెడ్డే (నిర్మాత) అని చెప్పుకోవచ్చు.