10 ఫిబ్ర, 2009

మనుషులు మారాలి


చీకటి లో
బ్లాగు చీకటి లో
పోస్ట్ అనే పడవ లో
ఘోస్టు అనే వ్యాఖ్యతో
ఏ దరికో , ఏ దశకో
జాలరి వలలో చేపవు నీవే .గానుగ మరలో చేరుకువు నీవే.
జాలే లేని బ్లాగు లోకం లోన దారే లేని బ్లాగర్ నీవే
లేరెవరు.నీకెవరు
http://www.chimatamusic.com/playcmd.php?plist=2059

3 ఫిబ్ర, 2009

దేవీ కరుణించుము


ఇందుమూలముగా సమస్త బ్లాగ్ జనులకు తెలియ జేయునది ఏమనగా నాకు ఈ బ్లాగ్ తప్ప వేరే ఏ కాగడా తో గాని ,కంచు తో గాని, దుమ్ము తో గాని తుమ్ము తో గాని ,శరత్ కాలాలతో గాని , వసంత కాలాలతో గాని ,ఏ విధమైన క్రమ లేదా అక్రమ సంభంధాలు లేవు అని .ఏదో బ్లాగింగు అంటే మనసుకి తోచింది రాసేసుకుని చూసేసుకుని ఆ పైన మూసేసుకుని కూర్చోవడమే అనుకున్నా గాని ఇలా నాలుగు నెలలకే చాయంగల విన్నపాలు చేసుకోవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.ఇంక నా మానసిక సంతులత గురించి వివరణ ఏమనగా , మొన్నటి వరకూ నా బుర్ర రామాయణ కల్ప వృక్షం , ఆ మద్య సున్నున్దలనబడే రవ్వలడ్డులు తిన్నప్పటి నుంచి రామాయణ విష వృక్షం లా మారిందని ఇంచుక అనుమానం.అప్పుడే ఏదో మత్తు ప్రయోగం జరిగి వుంటుందని అభిజ్న వర్గాల బోగట్టా. అందుకు విరుగుడుగా జన్తికలన బడే చక్కిలాలని ప్రమదావనం మిత్రు రాళ్ళు మొన్నటి సమాచారాన్ని ఇచ్చినట్టు గా తెచ్చి ఇచ్చిన యెడల మరల జన జీవన స్రవంతి లో పాడెదను.రండి ఉత్సహించి పాడెదము రక్షణ నిచ్చును అయ్యో ఇదేంటి దేవీ స్త్రోత్రనికి బదులు ప్రభువు స్తోత్రం చదువుతున్నా.నాకు మెంటల్ ఎక్కిన్దంట , పిచేక్కిన్ దంట , అయ్యో బ్రహ్మానందం స్టీల్లో dialogues వచేస్తున్నాయి baboi విరుగుడు ఇవ్వుమా దేవీ కరుణించుమా కటక్షించుమ.

29 జన, 2009

ప్రమదా వనం లో చర్చించ వలసినంత అవసరమా?


అసలు ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు.ప్రమదా వనం లో చర్చించు కోడానికి దోసల పిండి తో గారెలు ఎలా చెయ్యాలి?ఆవకాయ ఎండి పొతే నీళ్ళు పోసి భూజు రాకుండా ఎలా వుంచుకోవాలి?100 రూపాయల చీరని వెయ్యి రూపాయలుగా ఎలా చూపించు కోవాలి లాంటి ఎన్నో ఇంటరెస్టింగ్ సబ్జక్ట్స్ వుండగా,సమాజం లో కొద్దో గొప్పో ఉన్నతమైన స్థితి లో ఉండి నా మానన నేను ఏదో నిషి గారి ని చూసి ప్రేరణ పొంది , బ్లాగ్ తయారుచేసుకుని అప్పుడప్పుడు రాసుకుని పోతుంటే ,వల్లెవరి వో తొక్కల దోసలు పొగడ లేదని లేదా చేసిన వంటకానికి వంకలు పెట్టామని మనసులో పెట్టుకుని , ప్రతి దానికి కువిమర్శలు చేసి వాడు వెధవ వేదవన్నర వెదవ అని తిన్నది అరిగేదాకా ఆయాస పడి తిట్టుకుని, కూడలి లోంచి వాడి బ్లాగ్ తీసెయ్యాలని మంగమ్మ సపధాలు అవసరమా?అంత కూడలి లోంచి తిసేయ్యవలసింత కూడని పని నేనేం చేసాని సదరు వ్యక్తులు తెలియబరుస్తారా?నా ఒక్కడి బ్లాగే అలా అవడం తో needle of suspicion ఎవరైనా చేసి ఉంటారేమో అనే అనిపించింది?అరుణం గారు రాసినదానికి నేను ఇచ్చిన కామెంట్ ఏంటో కూడా ఇదే బ్లాగ్ లో పెట్టానే. అది ఆ రాతలోని విషయానికి సంభందిన్చిందే గాని వేరే ఏమి కాదు కదా? ఆయినా కంద కి లేని దురద కత్తి పిటకు దేనికి?అలాగే నచ్చని వాళ్ళవి కూడలి లోంచి తీసెయ్యి అంటూ చిన్న పిల్లలా మారము చేస్తే '' చివరకు మిగిలేది '' మనం మన వందిమాగతులు అది ఎప్పటికి కాబోదు అందమైన వనం. అసలు పోల్ conduct చేస్తే తెలిసి పోతుంది నా బ్లాగ్ వుంచాలో కూడలి లోంచి తీసెయ్యాలో?కూడలి కన్నా వేగంగా ఆల్మోస్ట్ రాసిన వెంటనే చూపించే googletelugu బ్లాగ్స్ చాల వున్నాయి. నా కోడి కుయ్యక పొతే లోకానికి తెల్లవారదు అనుకునే అంత అజ్ఞానం లో వివేన్ గారు ఉండరని నా నమ్మకం.పక్క వాద్య గాళ్ళ సన్నాయి నొక్కులకి మొహమాటపడి అప శ్రుతులు పలికిన్చరనే విశ్వాసం. చూద్దాం ఏం జరుగు తుందో.ప్రస్తుతానికి బెనిఫిట్ అఫ్ డౌట్ ఇస్తూ నా బ్లాగ్ లో జరిగిన దానికి సాంకేతిక లోపాలేకారణం అని నమ్ముతూ ఏ కోతులు నా కిష్కింద లోకి రాలేదని నమ్ముతూ ఫిబ్రవరి 1 దాక వేచి చూస్తా ఇలాగే.శ్రీధర్ గారు మీ no నా దగ్గర లేక పోవడం వల్ల మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యలేక పోయా. no దొరికే టైం కి చెయ్యి జారి పోయి ఇన్ని మలుపులు తిరిగి నేనీ react అవ్వ వలసిన పరిస్తితి వచ్చింది.గమనించ గలరు.

28 జన, 2009

కుల్లుమోతు కోతి


గత నాలుగు రోజులుగా నా బ్లాగ్ visit చేసిన బ్లాగర్స్ గమనించే వుంటారు అందమైన templetes తో ఆహ్లాదం గా వుండే నా బ్లాగ్ కొన్ని కుల్లుమోతు కోతుల వల్ల ''upgrade to pro today'', bandwidth exceeded అంటూ ముఖ్యమైన places లో అతుక్కుని కని పించడం తో పాటు నా పేజి templete కూడా చెరిపేశారు.ఇదంతా కూడా నిర్మొహమాటం గా అభిప్రాయాలూ వెల్ల బుచ్చడం, వాళ్ళ బ్లాగ్స్ లో నా కు నచ్చనవి ఎత్తి చూపడం తో సద్విమర్శల్ని సహృదయం తో స్వ్వీకరించే గొప్ప మనసు లేక ఇలా సాంకేతిక దాడులకి పాల్పడడం. ఆయినా అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. పోనీ నేను templete మారుద్దమన్న కూడా అది మార్వా నివ్విడం లేదు.ముంబై దాడుల్లో ముష్కరలు తాజ్ హోటల్ అందాల్ని నాశనం చేసి ఉండొచ్చు గాక దానికి ఉన్నా డిమాండ్ ని మాత్రం ఏమి చెయ్యలేరు కదా.అందు చేత హోటల్ మీద కుళ్ళు తో నల్ల పైంట్ కొట్టినంత మాత్రాన లోపల సరుకు రుచి గా వుంటే బాబాయి హోటల్ కి కూడా డిమాండ్ వుంటూనే వుంటుంది.ఒక మనిషి లో సంస్కారం విమర్శలకి ప్రతిస్పందించిన విధానం లోనే తెలిసి పోతుంది.అందరు ఆకాశానికి ఎత్తేసే వాళ్ళే కావాలను కుంటే ,నా బ్లాగు నా కామెంటు అని రెండూ తనే రాసుకుని మిగతావి reject చేస్తే సరి.నేను మాత్రం తాటాకు చప్పులకి భయ పడి రాయడం ఆపను , ఇదే బ్లాగ్ ని బూత్ భంగ్ల గా మార్చినా సరే రాస్తూనే వుంటా ''నన్నపలేవ్ బొమ్మాలి ఆపలేవ్ '', అఘోరిలని రప్పించైనా నీ ఆటలు కట్టిస్తా బొమ్మాలి . అయ్యా అది విషయం ''ఎవరో గాయం రగిలించారు వేరవరో దానికి బలి అయినారు'' అంటూ పాడుకుంటూ రాసుకుంటూ పోతా.

25 జన, 2009

అరుంధతి సినిమాలో లోపాలు


ఈ రోజే అరుంధతి సినిమా చూడడం జరిగింది.ఇప్పటికే సమిక్షలలో సినిమాని ఆకాశానికి ఎత్తెయ్యడం వల్ల హై expectations తో చూడడం తో కొంత అసంతృప్తి కి లోనవడం జరిగింది. అందుకే ఇంక సమిక్షించకుండా నేను కని పెట్టిన లోపాలే రాస్తాను. మొట్టమొదటి పెద్ద లోపం ఏంటంటే జేజమ్మ ఎముకలతో చేసిన కత్తి లాంటి ఆయుధం పని చెయ్యాలంటే ,ఆ పశుపతి ప్రేతాత్మ ఎవరినైనా అవహించినప్పుడే పని చేస్తుందని ఆ ఆయుధం ఇస్తునప్పుడే అఘోరి (లేదా ఆ ఋషి) చెపుతాడు. కానీ క్లైమాక్స్ లో అరుంధతి ఆ ప్రేతాత్మ నే పొడిచినట్టు చూపుతారు.అలాగే పశుపతి కొంత సేపు వేరే మనుషుల మిద అవహిస్తూ మాట్లాడి, మళ్ళి నాశనం అయిపోయిన తన పాత రూపం లో ఎలా వస్తాడో?అలాగే పకిర్ ని ప్రేతాత్మ చంపేసినట్టు గా నీళ్ళలో ములిగి పోయినట్టు గా చూపించి మళ్ళి బతికోచినట్టు గా చూపిస్తారు.
ఒక సీన్ లో 9999 నెంబర్ కార్ రైల్ గేటు దగ్గర పట్టాల మీద ఇరుక్కు పొఇ రైల్ డీ కొట్టాక మండి పోయి నట్టు గా చూపించారు మళ్ళి నెక్స్ట్ సీన్ లో అదే కార్, no తో సహా అదే ,అరుంధతి ఫ్యామిలీ హైదరాబాద్ వెళ్తునట్టు చూపిస్తారు.ఇంకో లోపం ఏంటంటే అరుంధతి ఆయుధం గా మారడం కోసం చని పోయే సీన్ లో వున్నా ముసలి అఘోరి కి అప్పటికే 70 ఏళ్ళు ,రెండో అరుంధతి మళ్ళి పుట్టి అదే రూపం లో రావడానికి 80 ఏళ్ళు పట్టినట్టు గా కధలో అర్ధం అవుతుంది అంటే ఆ ముసలాయన వయసు 150 అనుకోవాలా?ఈ సినిమా రెండు ప్రేతాత్మ ల పగ గా చెప్పుకోవచ్చు.50 కోట్లు దాక వసూల్ చేయొచ్చు అంటున్నారు ?అంత సీన్ నాకైతే కనబడలె . ఆ రోజుల్లోనే పాపం విటలచార్య ఇంత కంటే మంచి మాయల మరాటి సినిమాలు తీసినా మీడియా exposure అప్పట్లో లేదు కాబట్టి వసువుల్లలొ వెనక బడి వుండొచ్చు.కలదన్నవి కలవో ? లేవో?గాని వాటి పేరు చెప్పుకుని బాగు పడిన వారి లిస్టు లో యండమూరి తర్వాత శ్యాం ప్రసాద్ రెడ్డే (నిర్మాత) అని చెప్పుకోవచ్చు.