బ్లాగింగు మొదలెట్టిన కొత్తలో బ్లాగర్ కొత్త పెళ్ళికొడుకు తో సమానం .పగలు రాత్రి తేడాలేకుండా ఎప్పుడు బ్లాగ్ మీదే ద్యాస .ఎప్పుడు ఎప్పుడు రాసేద్దమా ఎప్పుడెప్పుడు కామెంట్స్ చూసేద్దమా ?అన్న ఆత్రమే .కొత్త బిచ్చగాడు పొద్దెర గడని అర్దరాత్రి అపరాత్రి కూడా ,జీవిత భాగస్వామి ఎవోయి కొంచెం పడుకోడానికి రావొచ్చు గా ?అన్నా కూడా అబ్బ ఇవాల్టికి నన్ను వదిలెయ్యండి పని వుంది అని రెచ్చి పోయి రాసేసిన రోజులు కూడా వుంటాయి .కాలం గడుస్తున్న కొద్ది మన బ్లాగ్ లో ఏమి చెత్త రాసినా కూడా వా వా అనే వంది మాగతులు కూడా తయారవుతారు .మనకి తెలీకుండానే వొక వర్గానికి కొమ్ము కాస్తూ ఆ వర్గాన్ని నొప్పించకుండా వ్యతిరేక వర్గాన్ని రెచ్చ గొడుతూ రాస్తూ ఉంటాము .కొన్నాళ్ళకి రాయడానికి సబ్జక్ట్స్ అన్ని అయిపోతాయి .బ్లాగ్ తో పెళ్లి అయ్యి సంవత్సరం దాటి పోతుంది .మొదట్లో వున్న మోజు తగ్గి పోతుంది .యి రెండు సంవత్సరాలలో బ్లాగ్ కి దగ్గరవడం వల్ల ఇంట్లో వాళ్ళకి దూరం అవుతాము.మొదట్లో వున్న ఉదృతి స్తబ్తత గా మారు తుంది .బ్లాగ్ లో రాసేదిచదివి వుహించుకున్న రూపాలు వాస్తవం లో శాపాలు గా మారతాయి .వాస్తవం కన్నా వుహే బావుంటుంది .యి లోపు ఆఫీసు లో శ్రద్దగా పని చెయ్య కుండా బ్లాగ్ లో రాసుకున్టున్నరన్న విషయం పైదాకా పోతుంది.దాంతో పైవాడు వేరే ఊరికి ట్రన్స్ఫెర్ చేస్తాడు (గవర్నమెంట్ లో అయితేనే ).ప్రైవేటు లో వుద్యోగం వుడుతుంది .కళ్ళకి జోడు ,ఇంట్లో వాళ్ళకి కొత్త తోడూ కూడా రావొచ్చు .అప్పటికి కళ్ళు తెరుచుకో బడి బ్లాగోదయం అవుతుంది .వైరాగ్యం పుట్టుకొస్తుంది .పని పాట లేని వాళ్ళు మాత్రమె బ్లాగింగు చేస్తారని చేతినిండా పని వున్న వాడు బ్లాగ్ మొఖం చూడడని పోస్టింగ్స్ రాసుకుని స్వేదబిందువులు తుడుచుకుని నిర్వేదం లో పడిపోతాం .యి స్టేజి లన్ని దాటుకొచ్చిన అనుభవజ్ఞులైన బ్లాగర్లకి యిది ప్రసూతి వైరాగ్యం అని అర్ధం అవుతూనే వుంటుంది .ఛి యిక జన్మలో భర్తని దగ్గరికి రానిచ్చేది లేదని మంగమ్మ శపధం చేసిన ఇల్లాలు మళ్ళి రెండో కాన్పు కి కూడా అలానే అంటుంది .యిది అంతే కొన్నాళ్ళు యి వందమంది కోసం ఏమిటి నా సమయం వృధా చేసేది అన్న నిర్వేదం తో బ్లాగ్ అంటే మొహం మొత్తి దూరం గా జరుగు తాము .మళ్ళి ఎవరో మిత్రులు ఫోన్ చేసి మళ్ళి బ్లాగుల్లో యుద్దాలు మొదలయ్యాయి చూసావా అనగానే సాయంత్రం ఆరు దాటగానే కల్లు పాకకి పరిగెత్తే తాగుబోతులా , కంప్యూటర్ ని చూడగానే స్వామి రారా బ్లాగోత్తమ పురుషా రా రా అని పిలుస్తున్నట్టు గా భావించుకుని రంగం లోకి దిగి పోతాం .మళ్ళి చర్విత చరణమే .నే చెప్పేదేమిటంటే యిదొక వ్యసనం అని వచ్చాకే తెలుస్తుంది తెలిసాక పెద్ద గా చేసేది ఏమి వుండదు యిదొక వ్యసనం అని పోస్ట్ రాసుకోవడం తప్ప .ఎటొచ్చి పెళ్ళయిన కొత్తలో ఉన్నంత ముద్దు ముచ్చట ఆ తర్వాత రోజుల్లో ఎలా తగ్గి పోతూ అప్పుడప్పుడు లోకి వెళ్ళిపోతుందో బ్లాగ్ లో రాతలు కూడా అదే పందాని అనుసరిస్తాయి .యిది కాలం తెచ్చే మార్పే కాదంటారా? .
మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
10 జులై, 2010
బ్లాగర్ వైరాగ్యం
బ్లాగింగు మొదలెట్టిన కొత్తలో బ్లాగర్ కొత్త పెళ్ళికొడుకు తో సమానం .పగలు రాత్రి తేడాలేకుండా ఎప్పుడు బ్లాగ్ మీదే ద్యాస .ఎప్పుడు ఎప్పుడు రాసేద్దమా ఎప్పుడెప్పుడు కామెంట్స్ చూసేద్దమా ?అన్న ఆత్రమే .కొత్త బిచ్చగాడు పొద్దెర గడని అర్దరాత్రి అపరాత్రి కూడా ,జీవిత భాగస్వామి ఎవోయి కొంచెం పడుకోడానికి రావొచ్చు గా ?అన్నా కూడా అబ్బ ఇవాల్టికి నన్ను వదిలెయ్యండి పని వుంది అని రెచ్చి పోయి రాసేసిన రోజులు కూడా వుంటాయి .కాలం గడుస్తున్న కొద్ది మన బ్లాగ్ లో ఏమి చెత్త రాసినా కూడా వా వా అనే వంది మాగతులు కూడా తయారవుతారు .మనకి తెలీకుండానే వొక వర్గానికి కొమ్ము కాస్తూ ఆ వర్గాన్ని నొప్పించకుండా వ్యతిరేక వర్గాన్ని రెచ్చ గొడుతూ రాస్తూ ఉంటాము .కొన్నాళ్ళకి రాయడానికి సబ్జక్ట్స్ అన్ని అయిపోతాయి .బ్లాగ్ తో పెళ్లి అయ్యి సంవత్సరం దాటి పోతుంది .మొదట్లో వున్న మోజు తగ్గి పోతుంది .యి రెండు సంవత్సరాలలో బ్లాగ్ కి దగ్గరవడం వల్ల ఇంట్లో వాళ్ళకి దూరం అవుతాము.మొదట్లో వున్న ఉదృతి స్తబ్తత గా మారు తుంది .బ్లాగ్ లో రాసేదిచదివి వుహించుకున్న రూపాలు వాస్తవం లో శాపాలు గా మారతాయి .వాస్తవం కన్నా వుహే బావుంటుంది .యి లోపు ఆఫీసు లో శ్రద్దగా పని చెయ్య కుండా బ్లాగ్ లో రాసుకున్టున్నరన్న విషయం పైదాకా పోతుంది.దాంతో పైవాడు వేరే ఊరికి ట్రన్స్ఫెర్ చేస్తాడు (గవర్నమెంట్ లో అయితేనే ).ప్రైవేటు లో వుద్యోగం వుడుతుంది .కళ్ళకి జోడు ,ఇంట్లో వాళ్ళకి కొత్త తోడూ కూడా రావొచ్చు .అప్పటికి కళ్ళు తెరుచుకో బడి బ్లాగోదయం అవుతుంది .వైరాగ్యం పుట్టుకొస్తుంది .పని పాట లేని వాళ్ళు మాత్రమె బ్లాగింగు చేస్తారని చేతినిండా పని వున్న వాడు బ్లాగ్ మొఖం చూడడని పోస్టింగ్స్ రాసుకుని స్వేదబిందువులు తుడుచుకుని నిర్వేదం లో పడిపోతాం .యి స్టేజి లన్ని దాటుకొచ్చిన అనుభవజ్ఞులైన బ్లాగర్లకి యిది ప్రసూతి వైరాగ్యం అని అర్ధం అవుతూనే వుంటుంది .ఛి యిక జన్మలో భర్తని దగ్గరికి రానిచ్చేది లేదని మంగమ్మ శపధం చేసిన ఇల్లాలు మళ్ళి రెండో కాన్పు కి కూడా అలానే అంటుంది .యిది అంతే కొన్నాళ్ళు యి వందమంది కోసం ఏమిటి నా సమయం వృధా చేసేది అన్న నిర్వేదం తో బ్లాగ్ అంటే మొహం మొత్తి దూరం గా జరుగు తాము .మళ్ళి ఎవరో మిత్రులు ఫోన్ చేసి మళ్ళి బ్లాగుల్లో యుద్దాలు మొదలయ్యాయి చూసావా అనగానే సాయంత్రం ఆరు దాటగానే కల్లు పాకకి పరిగెత్తే తాగుబోతులా , కంప్యూటర్ ని చూడగానే స్వామి రారా బ్లాగోత్తమ పురుషా రా రా అని పిలుస్తున్నట్టు గా భావించుకుని రంగం లోకి దిగి పోతాం .మళ్ళి చర్విత చరణమే .నే చెప్పేదేమిటంటే యిదొక వ్యసనం అని వచ్చాకే తెలుస్తుంది తెలిసాక పెద్ద గా చేసేది ఏమి వుండదు యిదొక వ్యసనం అని పోస్ట్ రాసుకోవడం తప్ప .ఎటొచ్చి పెళ్ళయిన కొత్తలో ఉన్నంత ముద్దు ముచ్చట ఆ తర్వాత రోజుల్లో ఎలా తగ్గి పోతూ అప్పుడప్పుడు లోకి వెళ్ళిపోతుందో బ్లాగ్ లో రాతలు కూడా అదే పందాని అనుసరిస్తాయి .యిది కాలం తెచ్చే మార్పే కాదంటారా? .
1 జులై, 2010
తిరుమల లో కుంగిన స్వామి విగ్రహం ?

యి రోజు ఆఫీసు లో బిజీ గా పని లో వుంటే తిరుమల లో స్వామి కి పూజాదికాలు నిర్వహించే పూజారి గారు స్వామి ప్రసాదం తీసుకుని నా రూం కి వచ్చారు .యెంత బిజీ లో వున్నా ఆయన వచ్చినప్పుడు కనీసం పది నిమిషాలన్న ఆయనకీ కేటాయించి ఆద్యాత్మిక విషయాలు మాట్లాడు కోవడం రివాజు .మిగత స్టాఫ్ ని తర్వాత రమ్మని ఆయనతో మాట్లాడుతుంటే విచార వదనం తో కనిపిస్తే విషయం ఏంటని అడిగితె తెలిసిన నిజం వింటే నాకే వొళ్ళు గగ్గురు పుట్టింది .
విషయం ఏంటంటే తిరుమల గర్భ గుడిలో వున్న స్వామి విగ్రహం వొక అడుగు మేర కిందకి కుంగి పోయింది .అంతే కాదు విగ్రహం చుట్టూ వొక ఇంచ్ మేర నీళ్ళు ఊట లా వూరి ఉంటున్నాయి .స్వామి విగ్రహం కింద లోతుగా ఆకాశ గంగ ప్రవహిస్తోందని తెలిసింది .ఇప్పుడు ఆ విగ్రహాన్ని వొక అడుగు మేర లేపడానికి మల్ల గుల్లాలు పడుతున్నారట .ఎందుకంటె అదో పెద్ద ప్రక్రియ .మూడు నెలల పాటు గర్భ గుడిలో పూజ పునస్కారాలు వుండవు .ముందు గా స్వామి విగ్రహం లోని శక్తిని కలశం లోకి ఆహ్వానించి , ఆ కలశ ముఖం గా వొక వెయ్యి ఎనిమిది హోమాలు గుడి చుట్టూ పెట్టి పూజాదికాలు నిర్వహించాలి .యి లోపు గణపతి స్తపది ద్వార మాత్రమె విగ్రహాన్ని అడుగు మేర పైకి లేపాలి .యివన్నీ బ్రహ్మోత్సవాల లోపు చెయ్యడం అసాద్యం కనక యిప్పుడు ఏమి చెయ్యాలో తేలిక ఆలయం లో ముఖ్యులు తలలు పట్టుకు కూర్చున్నారని సమాచారం .ఇదేదో రాబోయే చెడుకు సూచనగా భావించోచ్చా?అని అడిగితె అయ్యా ఇప్పుడు అర్చకులలోనే కుమ్ములాట మొదలయ్యింది మిరాసి వ్యవస్థ కొనసాగాలని , కాంట్రాక్టు పద్దతి లోనే వుండాలని రెండు వర్గాలుగా చీలి పోయి దేవుడిని శ్రద్దగా పట్టించుకోక పోవడం తో అరిస్టమే ఖాయం అని పిస్తోంది అంతే కాదు 2012 సంవత్సరానికి స్వామి సగానికి పైగా కిందకి కుంగి పోతారని అదే యుగాన్తానికి నాంది అని కళ్ళ లో నీళ్ళు వత్తు కుంటూ చెపుతున్నాడు . యిలోపే బయట అసహనం గా వెయిట్ చేస్తున్న సందర్శకులు , వి ఐ పీ లు లోపలకి రావడం తో అయన సెలవు తీసుకుని భారం గా కదిలారు . నేను చేష్ట లుడికి మౌనం గా మాన్పడి పోయాను .ఇంకా నయం ఏ tv9 వాడికో యి సమాచారం చేరి వుంటే కుంగిన వెంకన్న అంటూ పొద్దుట నుంచి రాత్రి దాక ఊదర గొట్టి వుండే వాడు . అయినా తిరుమల పెద్దలు కూడా యి విషయం బయట ఎక్కడా పొక్క కుండా జాగర్త పడుతున్నట్టు అభిజ్న వర్గాల బోగట్టా .
19 జూన్, 2010
రావణ్ చూసే సాహసం చేయొద్దు
ఇప్పుడే రావణ్ సినిమా చూసి బతికి బట్ట కట్టి వచ్చా .మణిరత్నం సగం సినిమా అయ్యాక గుండె పోటు వచ్చినదంటే రాదా మరి ?రశేష్ చూసి ఉంటాడు .రామాయణాన్ని ఆధునీకరించి జనాల మీదకి వోదులుదామన్న ప్రయత్నమే యి సినిమా .సినిమా మొదలవ్వడమే రావణ్ (అభిషేక్ బచ్చన్ )సీతని (ఐశ్వర్య )పడవలో కిడ్నాప్ చెయ్యడం తో మొదలవుతుంది .ఎందుకు కిడ్నాప్ చేస్తున్నడన్నది ఇంటర్వల్ కి కూడా తెలీదు .ఇంటర్వల్ వరకు సీతాన్వేషణలో ఆమె భర్త ఎస్పీ (విక్రం )పోలీసులని వెంటేసుకుని అడవుల్లో గాలించడమే సరి పోతుంది .టూకీగా కధ చెప్పుకోవాలంటే రావణ్ చెల్లి (ప్రియమణి)ప్రేమించిన వాడితో పెళ్లి జరగ బోతుంటే ,రాబిన్హుడ్ లా వున్న వాడిని దోచి తన వాళ్ళకి పెట్టె రావణ్ ని అర్రెస్ట్ చెయ్యడానికి వస్తే పెళ్ళికొడుకు పారి పోతాడు పొలిసు వాళ్ళు ప్రియమణి ని స్టేషన్ కి తీసుకెళ్ళి పెళ్లి చెడిపోయింది గాని శోభనం కాదని మానభంగం చేస్తారు .ఆమె ఆత్మా హత్య చేసుకుంటుంది . దాంతో కక్ష గట్టిన రావణ్ ఎస్ పీ భార్యని కిడ్నాప్ చేసి తన దగ్గర పెట్టుకుంటాడు .సీత మొదట్లో అపార్దం చేసుకున్న తన కిడ్నాప్ వెనక కధ విని ,అడవిలో మనుషులు రావణ్ కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్దం అని తెలుసుకుని అతని మీద సదభిప్రాయం తోనే వుంటుంది .హనుమంతుడి లాంటి గోవిందా సాయం తో మొత్తానికి రావణ్ స్తావరం కని పెడతాడు ఎస్ పీ . అయితే సంధి కోసం రావణ్ తమ్ముడు ఎస్ పీ దగ్గరకి వెళితే మోస పూరితం గా అతన్ని చంపేస్తాడు .దాంతోప్రతీకారం తో ఎస్ పీ అడవిలో బస చేసిన గుడారాలని పోలీసులని రావణ్ పేల్చే స్తాడు . ఎస్ పీ ని చంపే అవకాసం వచ్చినా కూడా వదిలేసి నీ భార్య బంగారం దాని మొహం చూస్తే నిన్ను చంప బుద్ది అవడం లేదు . నాలో మృగం విజ్రుభించి ఆమెని ఏమీ చెయ్య కుండా తీసుకు వెళ్లి పో అని పంపేస్తాడు .హమయ్య సినిమా అయ్యింది రా బాబు అనుకుంటే ట్రైన్ లో వెళుతూ ఎస్ పీ ఆ రావణ్ పద్నాలుగు రోజులు ఉంచుకుని నిన్ను ఏమి చెయ్య లేదా?అని అడుగుతాడు . లేదు చెయ్య లేదు అతను చాల మంచి వాడు అయినా నా మొహం చూస్తేనే అర్ధం అవటం లేదా ఏమి జరగ లేదని ?అంటుంది . దానికి బదులు గా ఎస్ పీ లేదు నువ్వు అబద్దం చెపుతున్నావ్ నాకు అతను ప్రాణ బిక్ష పెట్టినప్పుడు ఆ పద్నాలుగు రోజులు ఎన్ని విధాల ఆనందం పొందినది చెప్పేసాడు అంటే ఆమె చైన్ లాగి రైల్ దిగి పోయి అడవిలో అతన్ని వెత్తుకుంటూ వెళ్లి చచ్చినాడ మా ఆయనికి ఏం చెప్పి చచ్చావురా మనిద్దరికీ రంకు అంట గడుతున్నాడు అని అడుగుతుంది .నేనేం చెప్పాను నువ్వు బంగారం నాలో మృగం బయటకొచ్చి తప్పు జరిగేలోపు పట్టుకు పోరా బాబు అన్నా అంటాడు .ఆ స్టేజి లో ఆమె రావణ్ తో సెటిల్ అయిపోతున్దనట్టు గా హావ భావ విన్యాసాలు పలికిస్తుంది సో ఇదన్న మాట మోడరన్ రామాయణం అనుకుంటూ జనాలు సీట్ లోంచి లేచే లోపు వెనక నుంచి ఎస్ పీ పొలిసు బలగాలతో వచ్చి రావణ్ మీద తుపాకీ ఎక్కు బెడతాడు . నహీ అంటూ సీత వచ్చి రావణ్ గుండెలకి అడ్డం గా తన గుండెలు పెడుతుంది ,గుండు దూసుకు వస్తుంటే రావణ్ సీత తలని వత్తేసి గుండు తన గుండెల్లో దూసుకు పోయేలా చూసుకుంటాడు .కొండ మీద నుంచి జారి పోతూ హిందీ మగధీర లా ఆమె కేసి వేళ్ళు జాపితే ఆమె కూడా కాజల్ లాగ వెళ్ళు చాపుతుంది కళ్ళలో నీళ్ళు కుక్కుకుని .జనాలు బుర్రలు గోకుకుంటూ భారం గా బయటకు అడుగులు వేసారు .
యి సినిమా తియ్యడానికి వొకటిన్నర సంవత్సరాలు పట్టిందంటే పట్టదా మరి రామాయణ విష వృక్షం ఆయే మరి .చినప్పుడు మా స్నేహితుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తో రిలీజ్ అయిన ప్రతీ సినిమాకి పోతూ వుండే వాడు బాగున్నా బాగోలేక పోయినా . వొక రోజు వుండ బట్ట లేక ఏంటి యిలా ప్రతి సినిమా ఎందుకు చూస్తారంటే వాడిచ్చిన సమాధానం బావున్న సినిమా ఎందుకు బావుందో చూస్తారట , బావోని సినిమా ఎందుకు బావోలేదో చూస్తారట సో అంత సినిమా పిచ్చి వుంటే తప్ప యి సినిమాకి పోవడం సాహసమే యి కధ కూడా నేను కూడా కొద్దో గొప్పో రచయితా లాంటి వాణ్ణి కాబట్టి సినిమాలో గ్రోలి రాసింది గాని యింత అరటి పండు వలిచి పెట్టినట్టు మాత్రం కధనం లేదని ప్రేక్షకులు గమనించ ప్రార్ధన .
12 జూన్, 2010
అనుక్షణికం (ఆఖరి భాగం )
తాత్కాలికం గా సుధ ప్రేమ మత్తులో పడి గంటలు గంటలు సెల్ లో మాట్లాడుకున్నప్పుడు నాకు తెలీని ఇంకో విషయం ఏంటంటే వొక్క టికెట్ పై రెండు చిత్రాలు చూపిస్తున్నా అని . అదెలాగంటే నేను తన తో మాట్లాడే ప్రతీ మాట తరణి కి పూస గుచ్చి నట్టు చెప్పేది .బహుశా పెళ్లి అయినా కూడా తన వెనక ఇంకా మగాళ్ళు పడుతున్నారు సుమా అని గొప్పలు చెప్పుకోడానికి తను చెప్పుకుని ఉండొచ్చు గాని నా జీవితం లో అవి పెను మార్పులకి నాంది వాచకం అవుతాయని ఆమెకి అప్పుడుతెలీక పోవచ్చు .నా మాటలు అభిప్రాయాలూ సుధ ద్వార తెలుసుకున్న తరణి పరువు కోసం ప్రాకులాడే మనిషినని తేలిక గానే గ్రహించింది .అయితేతరణి విచ్చల విడి మనస్తత్వం , ఎలాగైనా సరే డబ్బు సంపాయించడం , విలాసవంత మైన జీవితం గడపడం .రేపు కు లేదు గారంటీ కాబట్టి గతం లో అనుభవించిన కష్టాలని మరచి పోయేలా వర్తమానం లో స్వర్గ సుఖాలు అనుభవించి భవిస్యత్తు కోసం బెంగ పెట్టుకోకుండా ఉండడమే తరణి జీవన విధానం .ఈ కోవ లోనే పరిచయం అయిన వాడే ఇన్స్పెక్టర్ రంగనాథ్ .అతనికి ఇంకా పెళ్లి కాలేదు .కాని చాలా విలాస పురుషుడు .తరణి కి ముందే చెప్పాడు తను రాముడు కాదు కృష్ణుడు అని.తనకి రాముడైనా క్రిశ్నుడైనా తన అవసరాలు తీర్చే దేవుడైతే అదే చాలని అంది .ఆ ఆండర్ స్టాండింగ్ లో ఆ ఇద్దరు పరిధులు దాట దానికి ఎంతో టైం పట్టలేదు . వొక సారి పరిధి దాటేసాక చనువు అధికారం పెరిగి పోతాయి కాబట్టి అదే చనువు తో వొక సారి మీ కజిన్ సుధ ఇంటికి తీసుకేలోచ్చు గా ?అని ఆడి గేసాడు రంగనాథ్ . ఎందుకు కన్నె పిల్లలు అయిపోయాక పెళ్లి అయిన వాళ్ళు కావలసి వచ్చిందా తరణి గట్టి గానే అడిగింది .నీ కుళ్ళు పొనిచ్చు కున్నావు కాదు ఆమె వేరే ఆయన తో ప్రేమాయణం సాగిస్తోంది కదా ఎలా వుంటుందో అన్న కుతూహలమే అంటే వొక సారి సుధ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేసింది . సందు ఇస్తే చొచ్చుకు పోదామనుకునే రంగనాథ్ తరణి కి తెలీకుండా రెండు మూడు సార్లు సుధ ఇంటికి వెళ్ళాడు . ఆ విషయం సుధ కూడా తరణి కి చెప్పక పోవడాన్ని అంగీకారం గా భావించుకుని వొక సారి మద్యాన్నం సుధ వోక్కత్తే వునప్పుడు వచ్చి మీ అందం నన్ను పిచ్చి వాణ్ణి చేస్తోంది తప్పు చేసి తన్నులు తిన్నా పరవాలేదని పిస్తోంది అంటూ అసభ్యం గా ప్రవర్తించ బోతే ఏం బాబు ఇప్పటికే ఎవరో అమ్మాయిని ప్రేమ పేరు తో మోసం చేసి పెళ్ళిచేసుకోకుండా తప్పించుకుని తిరుగు తుంటే ఆమె టీ వి ల కెక్కి నీ పరువు బజార్న పడయ్యేడం నువ్వు సస్పెన్షన్ లో వుండడం చాలా లేదా మళ్ళి నేను కూడా రంగం లోకి దిగాల అంది సుధ . ఎంటే పెద్ద పతివ్రతా లా మాట్లాడు తున్నావ్ ? నీ పై ఇంటి వాడితో జరుపుతున్న రంకు పురాణం బి బి సి లో కూడా చుపెడుతున్నారు అని విన గానే ఉగ్ర కాలి లా మారిన సుధ చీపురు తిరగేసి వాణ్ణి చితక కొట్టి పంపేసింది .వాడు నీ అంతు చూస్తానే అంటూ వెళ్లి పోయాడు .
అయితే ఈ విషయం నాకు చెప్పక పోవడం సుధ చేసిన తప్పు .ఇది జరిగిన రెండో రోజే నాకు అపరిచిత ఆడ ఆమె నుంచి సెల్ రావడం మొదలయ్యింది ఇది కొను అది కొను అని .ఇప్పుడు తెలిసిన భయంకరమైన నిజం ఏంటంటే నన్ను అప్పుడు అలా ఫొటోస్ చూపించి ఫోన్ లో కోర్కెల చిట్టా విప్పి నన్ను వీపీ అప్పారావు ని చేసింది మరెవరో కాదు తరణి అని .తనని అలా ప్రోత్సహించి డబ్బులు వసూలు చేయ్యిన్చిన్డి ఇన్స్పెక్టర్ రంగనాథ్ .మనిద్దరం ఇప్పటి యి విలాసన జీవితం వివాహానంతరం కూడా కోన సాగించాలంటే నువ్వు నే చెప్పినట్టు విని అతనిని ఫోన్ లో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపయిన్చావలసిందే అని హుకుం జారి చేసాడు . డబ్బుకంటే కూడా ముఖ్యం గా పెళ్లి చేసుకుంటాడన్న ఆనందం తరణి చేత అలా పురీ గోల్పించింది . అయితే తరణి పెళ్ళిచేసుకుంటావా ?చస్తావ ?అని ఇన్స్పెక్టర్ ని నా ట్రాన్స్ఫర్ అయిన రోజే నిర్భందిస్తే ఇంకొక్క లక్ష రూపాయలు అతని దగ్గర వసూల్ చెయ్యి అప్పుడు చేసుకుంటా అనడం తో ఆమె ట్రైన్ లో నన్ను ఫాలో చేసింది. అయితే నేనెప్పుడు తరణి గురించి సుధా ద్వార వినడమే గాని ప్రత్యక్షం గా చూడక పోవడం తో నేను కనిపెట్ట లేదు .అయితే సుధా వాళ్ళ అయన దుబాయి ఉద్యోగానికి వెళుతూ తన రహస్య స్నేహితురాలికి సుధా మీద వొక కన్నేసి ఎప్పటి కప్పుడు ఇక్కడ జరుగుతున్నా విషయాలని తనకి చేర వెయ్య మనడం తో ఆమె కొంచెం చిలువలు పలువలు
కూడా చేర్చి చెప్పడం తో నా మీద కక్ష పెట్టుకున్న సుధ భర్త , తరణి బ్లాక్మెయిల్ వ్యవహారం కూడా తెలుసుకుని ఆమె ని చంపడానికి దుబాయ్ లోనే'' సుపారి '' చెల్లించాడు .హత్య నేరం నా మీద పడేలా ఎత్తుగడ వేసాడు.
సస్పెన్షన్ లో వున్న ఇన్స్పెక్టర్ రంగనాథ్ డీ ఐ జి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మాయిని గుట్టు చప్పుడు కాకుండా విడిపించుకు వస్తానని అందుకు ప్రతి ఫలం గా తనని విధుల్లోకి చేర్చుకోమని ప్రాధేయపడి వాళ్ళ అమ్మాయిని తీసుకు వచ్చి అప్ప చెపుతాడు ,ఆమె పల్లి వాడ్ని ప్రేమించి ఆర్య సమాజం లో పెళ్లి ఎర్పా టూలు చేసుకుంటుండగా తరణి హత్య నేరం మీద పల్లీ వాణ్ణి అర్రెస్ట్ చేస్తారు , వాడు డబ్బుకు ఆశ పడీ పల్లిలలో విషాన్ని కలిపి కూపే లోంచి బయటకు వచ్చిన తరణి కి అమ్ముతాడు , పల్లిలంటే తరణి కి ప్రాణం రాత్రైనా పగలైన పల్లి అంటే ఎప్పుడు రెడీ అంటుందని తెలిసే దుబాయి సుపారి వాడు ఆమెని చంపడానికి పల్లి వాణ్ణి ఎంచు కుంటాడు.
డి ఐ జి వాళ్ళ అమ్మాయి క్షేమంగా ఇంటికి చేరిన సందర్భం లో నగరం లో ప్రముఖులకి డిన్నర్ ఏర్పాటు చేసాడు పొలిసు బాస్ దానికి నాకు కూడా ఆహ్వానం అందడం తో నేనూ వెళ్ళా. అందరి చేతుల్లోను గ్లాసులు మత్తు గా వుంది వాతావరణం. ఇంకో ఐ పీ ఎస్ ఆఫీసర్ అంటున్నాడు డి ఐ జి తో షార్ వొక్క దెబ్బ తో రెండు పిట్టల్ని పడ గొట్టారు ఆ పల్లిల వాణ్ణి యి హత్య నేరం లో యిరికించడం ద్వారా వాణ్ణి అడ్డు తొలగించుకోవడం తో పాటు మీ అమ్మాయికి వాడి మీద అసహ్యం వేసి మీరు తెచ్చిన సంభందమే చేసుకుంటా అనే స్తితి కి తీసుకు వచ్చారు , మీరు చాల గ్రేట్ షార్ అంటున్నాడు .కొంత సేపటికి ఆ ఇన్స్పెక్టర్ రంగనాథ్ వచ్చి డి ఐ జి కి సల్యుట్ చేసి అయన కటాక్ష విక్షనాలకై ఎదురు చూస్తూ నిల బడ్డాడు . అరగంట తర్వాత ఆయన కరుణించి ఓకే రంగనాథ్ గుడ్ జాబ్ అని ముక్తసరి గా వురుకున్న్నాడు ,దానికి వెంటనే రంగనాథ్ సార్ నన్ను డ్యూటీ లోకి తీసుకోండి సార్ హంతకుణ్ణి పట్టు కున్నాగా అంటే డి ఐ జి కోపం గా చూడు మిస్టర్ అసలు హంతకుడివి నువ్వే అని నాకు మాత్రమె తెలుసు ఆ రోజు ఆ అమ్మాయి ని ట్రైన్ దగ్గరుండి ఎక్కించి సైనైడ్ కలిపిన వాటర్ బాటిల్ ఇచ్చిన సంగతి బయట పెడితే వుద్యోగం కాదు వురి వస్తుంది కాబట్టి నోరుమూసుకుని కుక్కిన పెను లా పడీ వుండు అంటుంటే విని అవాక్కవడం నా వంతయ్యింది .అంటే ఇన్స్పెక్టర్ దృష్టిలో పల్లిల వాడు హంతకుడు డి ఐ జి ద్రుస్తిల్లో హంతకుడు ఇన్స్పెక్టర్ .మనసులో ఆనుకున్నా ఆ పోస్టుమార్టం చేసిన డాక్టర్ రెండు లక్షలు దొబ్బితే దోబ్బాడు గాని ఆ రాత్రి తరణి నిద్ర పొతున్నా అనుకుని నా వజ్రపు ఉంగరం లాగ డానికి ప్రయత్నిస్తుంటే నే చెయ్యి గట్టి గా విదిలించడం తో వజ్రం వూడి ఆమె నోట్లోకి వెళ్ళిపోయి పేగులు కోసేయ్యడం తో రక్త స్రావం అయ్యి చని పోయిందన్న విషయం ఎప్పటికి మా ఇద్దరి మధ్యే వుండి పోతుంది,ఏమన్నా గాని యి క్షణం ఆనందం గా వుందని మరు క్షణం అలాగే ఉంటుందని ఎప్పటికి అనుకోలేము అనుక్షణికం జీవితం ఆటు పోటులకి గురి అవుతూనే వుంటుంది .తాత్కాలిక మైన సుఖాలకోసం ప్రాకులాడితే దైవం అస్తమాను సాయం చేస్తుందని మాత్రం అనుకోకు నాయన చిద్విలాసం గా నవ్వుతు తెలుగు యోగి నా కేసి చూస్తూ అంటున్నాడు .ఏమో స్వామి మంచి పాత్ర ఇమ్మని అడగడమే మనం చెయ్యగలిగినది అంటూ పాత్రలోని మధురాసాన్ని గ్లాసులోకి వంపుకుంటూ అన్నా .ఇంతలో యోగి సెల్ రింగ్ అవుతోంది దాన్ని టేబుల్ మీద పెట్టి అయన బాత్ రూం లోకి వెళ్ళడం తో నేను ఆ సెల్ కేసి చూసి నోరు వెల్ల బెట్టా .తరణి కాలింగ్ అని వస్తోంది అంటే యోగి కి ఆత్మలు కుడా సెల్ చేస్తాయా ?
అయితే ఈ విషయం నాకు చెప్పక పోవడం సుధ చేసిన తప్పు .ఇది జరిగిన రెండో రోజే నాకు అపరిచిత ఆడ ఆమె నుంచి సెల్ రావడం మొదలయ్యింది ఇది కొను అది కొను అని .ఇప్పుడు తెలిసిన భయంకరమైన నిజం ఏంటంటే నన్ను అప్పుడు అలా ఫొటోస్ చూపించి ఫోన్ లో కోర్కెల చిట్టా విప్పి నన్ను వీపీ అప్పారావు ని చేసింది మరెవరో కాదు తరణి అని .తనని అలా ప్రోత్సహించి డబ్బులు వసూలు చేయ్యిన్చిన్డి ఇన్స్పెక్టర్ రంగనాథ్ .మనిద్దరం ఇప్పటి యి విలాసన జీవితం వివాహానంతరం కూడా కోన సాగించాలంటే నువ్వు నే చెప్పినట్టు విని అతనిని ఫోన్ లో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపయిన్చావలసిందే అని హుకుం జారి చేసాడు . డబ్బుకంటే కూడా ముఖ్యం గా పెళ్లి చేసుకుంటాడన్న ఆనందం తరణి చేత అలా పురీ గోల్పించింది . అయితే తరణి పెళ్ళిచేసుకుంటావా ?చస్తావ ?అని ఇన్స్పెక్టర్ ని నా ట్రాన్స్ఫర్ అయిన రోజే నిర్భందిస్తే ఇంకొక్క లక్ష రూపాయలు అతని దగ్గర వసూల్ చెయ్యి అప్పుడు చేసుకుంటా అనడం తో ఆమె ట్రైన్ లో నన్ను ఫాలో చేసింది. అయితే నేనెప్పుడు తరణి గురించి సుధా ద్వార వినడమే గాని ప్రత్యక్షం గా చూడక పోవడం తో నేను కనిపెట్ట లేదు .అయితే సుధా వాళ్ళ అయన దుబాయి ఉద్యోగానికి వెళుతూ తన రహస్య స్నేహితురాలికి సుధా మీద వొక కన్నేసి ఎప్పటి కప్పుడు ఇక్కడ జరుగుతున్నా విషయాలని తనకి చేర వెయ్య మనడం తో ఆమె కొంచెం చిలువలు పలువలు
కూడా చేర్చి చెప్పడం తో నా మీద కక్ష పెట్టుకున్న సుధ భర్త , తరణి బ్లాక్మెయిల్ వ్యవహారం కూడా తెలుసుకుని ఆమె ని చంపడానికి దుబాయ్ లోనే'' సుపారి '' చెల్లించాడు .హత్య నేరం నా మీద పడేలా ఎత్తుగడ వేసాడు.
సస్పెన్షన్ లో వున్న ఇన్స్పెక్టర్ రంగనాథ్ డీ ఐ జి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మాయిని గుట్టు చప్పుడు కాకుండా విడిపించుకు వస్తానని అందుకు ప్రతి ఫలం గా తనని విధుల్లోకి చేర్చుకోమని ప్రాధేయపడి వాళ్ళ అమ్మాయిని తీసుకు వచ్చి అప్ప చెపుతాడు ,ఆమె పల్లి వాడ్ని ప్రేమించి ఆర్య సమాజం లో పెళ్లి ఎర్పా టూలు చేసుకుంటుండగా తరణి హత్య నేరం మీద పల్లీ వాణ్ణి అర్రెస్ట్ చేస్తారు , వాడు డబ్బుకు ఆశ పడీ పల్లిలలో విషాన్ని కలిపి కూపే లోంచి బయటకు వచ్చిన తరణి కి అమ్ముతాడు , పల్లిలంటే తరణి కి ప్రాణం రాత్రైనా పగలైన పల్లి అంటే ఎప్పుడు రెడీ అంటుందని తెలిసే దుబాయి సుపారి వాడు ఆమెని చంపడానికి పల్లి వాణ్ణి ఎంచు కుంటాడు.
డి ఐ జి వాళ్ళ అమ్మాయి క్షేమంగా ఇంటికి చేరిన సందర్భం లో నగరం లో ప్రముఖులకి డిన్నర్ ఏర్పాటు చేసాడు పొలిసు బాస్ దానికి నాకు కూడా ఆహ్వానం అందడం తో నేనూ వెళ్ళా. అందరి చేతుల్లోను గ్లాసులు మత్తు గా వుంది వాతావరణం. ఇంకో ఐ పీ ఎస్ ఆఫీసర్ అంటున్నాడు డి ఐ జి తో షార్ వొక్క దెబ్బ తో రెండు పిట్టల్ని పడ గొట్టారు ఆ పల్లిల వాణ్ణి యి హత్య నేరం లో యిరికించడం ద్వారా వాణ్ణి అడ్డు తొలగించుకోవడం తో పాటు మీ అమ్మాయికి వాడి మీద అసహ్యం వేసి మీరు తెచ్చిన సంభందమే చేసుకుంటా అనే స్తితి కి తీసుకు వచ్చారు , మీరు చాల గ్రేట్ షార్ అంటున్నాడు .కొంత సేపటికి ఆ ఇన్స్పెక్టర్ రంగనాథ్ వచ్చి డి ఐ జి కి సల్యుట్ చేసి అయన కటాక్ష విక్షనాలకై ఎదురు చూస్తూ నిల బడ్డాడు . అరగంట తర్వాత ఆయన కరుణించి ఓకే రంగనాథ్ గుడ్ జాబ్ అని ముక్తసరి గా వురుకున్న్నాడు ,దానికి వెంటనే రంగనాథ్ సార్ నన్ను డ్యూటీ లోకి తీసుకోండి సార్ హంతకుణ్ణి పట్టు కున్నాగా అంటే డి ఐ జి కోపం గా చూడు మిస్టర్ అసలు హంతకుడివి నువ్వే అని నాకు మాత్రమె తెలుసు ఆ రోజు ఆ అమ్మాయి ని ట్రైన్ దగ్గరుండి ఎక్కించి సైనైడ్ కలిపిన వాటర్ బాటిల్ ఇచ్చిన సంగతి బయట పెడితే వుద్యోగం కాదు వురి వస్తుంది కాబట్టి నోరుమూసుకుని కుక్కిన పెను లా పడీ వుండు అంటుంటే విని అవాక్కవడం నా వంతయ్యింది .అంటే ఇన్స్పెక్టర్ దృష్టిలో పల్లిల వాడు హంతకుడు డి ఐ జి ద్రుస్తిల్లో హంతకుడు ఇన్స్పెక్టర్ .మనసులో ఆనుకున్నా ఆ పోస్టుమార్టం చేసిన డాక్టర్ రెండు లక్షలు దొబ్బితే దోబ్బాడు గాని ఆ రాత్రి తరణి నిద్ర పొతున్నా అనుకుని నా వజ్రపు ఉంగరం లాగ డానికి ప్రయత్నిస్తుంటే నే చెయ్యి గట్టి గా విదిలించడం తో వజ్రం వూడి ఆమె నోట్లోకి వెళ్ళిపోయి పేగులు కోసేయ్యడం తో రక్త స్రావం అయ్యి చని పోయిందన్న విషయం ఎప్పటికి మా ఇద్దరి మధ్యే వుండి పోతుంది,ఏమన్నా గాని యి క్షణం ఆనందం గా వుందని మరు క్షణం అలాగే ఉంటుందని ఎప్పటికి అనుకోలేము అనుక్షణికం జీవితం ఆటు పోటులకి గురి అవుతూనే వుంటుంది .తాత్కాలిక మైన సుఖాలకోసం ప్రాకులాడితే దైవం అస్తమాను సాయం చేస్తుందని మాత్రం అనుకోకు నాయన చిద్విలాసం గా నవ్వుతు తెలుగు యోగి నా కేసి చూస్తూ అంటున్నాడు .ఏమో స్వామి మంచి పాత్ర ఇమ్మని అడగడమే మనం చెయ్యగలిగినది అంటూ పాత్రలోని మధురాసాన్ని గ్లాసులోకి వంపుకుంటూ అన్నా .ఇంతలో యోగి సెల్ రింగ్ అవుతోంది దాన్ని టేబుల్ మీద పెట్టి అయన బాత్ రూం లోకి వెళ్ళడం తో నేను ఆ సెల్ కేసి చూసి నోరు వెల్ల బెట్టా .తరణి కాలింగ్ అని వస్తోంది అంటే యోగి కి ఆత్మలు కుడా సెల్ చేస్తాయా ?
7 జూన్, 2010
(అనుక్షణికం ఆరవ బాగం )
వారం రోజుల తర్వాత అసలు హంతకులు దొరకడం తో నన్ను విడిపించి ఐ జి తన కార్ లోనే ఇంటికి దిగబెడుతూ
'' సారీ అండి సీన్ ఆఫ్ ఆఫెన్స్ లో ఎవిడెన్స్ బట్టి మిమ్మల్ని అర్రెస్ట్ చెయ్య వలసి వచ్చింది , ఆ తెలుగు యోగి సహకారం తో అసలు హంతకుల్ని పట్టుకున్నాం''. అంటుంటే ఆత్రం ఆపుకోలేక ఎవరు? అని అడిగేసా , ఆ పొలిసు అయన మొఖం లో నీకేంటి అంత ఇంటేరేస్ట్టు అన్న భావం గోచరించి టాపిక్ మార్చడం కోసం మీ అమ్మాయి క్షేమంగా ఇంటికి చేరిందా? అని అడిగా .అయన మొఖం యెర్ర గా చేసుకుని మా వేదవలది అరవోడి రహస్యం అందరికి తెలిసేదాక ఇంకా రహస్యమనే అనుకుంటారు అన్నాడు . ఆయోయో వాళ్ళేమి చెప్పలేదండి వాళ్ళ ఆత్రం లో అన్న మాటలు నాకు వినబడి అడిగా అంతే అన్నా . ఓకే మీ దగ్గర రహస్యం ఎందుకు మా మొత్తంపరిశోధన లో చాల విషయాలు తెలిసాయి అందులో మీకు సంభందం వుంది కాబట్టి చెపుతా వినండి అంటూ మొదలెట్టాడు . దాని సారంశం ........
-----------------------------------------------------------------------
వాళ్ళ అమ్మాయి రొజూ కాలేజీ కి లోకల్ ట్రైన్ లో వెళ్ళేది .హాసిని తన పేరు ,తను అందరి కన్నా బిన్నం గా ఆలోచించే అమ్మాయినని తన అపోహ.దానికి తగట్టు గానే ప్రేమ పేరు తో వచ్చే సినిమాలు . అదేంటి టెన్త్ పాస్ అయినా ఇంకా ప్రేమ లో పడలేదా?(అదేదో పేడ లో పడలేదా అని అడిగినట్టు ) వంటి డైలాగులు ఆ సందర్భం లోనే వచ్చిన ''ప్రేమ సింహ '' సినిమా .అందులో హీరో పల్లీలు అమ్ముకుంటూ ట్రైన్ లో పోతుంటే హీరోయిన్ మొదటి చూపులోనే ప్రేమలో పడి పోయి
''సింహ మంటి చిన్నాడో పల్లీలమ్మ వచ్చాడే , సింహ సింహ సింహ అంటూ వెంట పడుతూ వుంటుంది ,దానికి ఆ అంకుల్ హీరో వద్దు అటు చూడొద్దు నా వైపే చూడు పల్లిల వైపు చూసావంటే నోట్లో వేసేసుకొవాలని టెంప్ట్ అయి పోతావు అంటూ పల్లీలు అమ్మేసుకుని ఆ వచ్చిన డబ్బులతో అవిటి చేల్లెలకి జైపూర్ ఫుట్,అమ్మకి గుండె ఆపరేషన్ , తమ్ముడ్ని కలెక్టర్ చెయ్యాలని జీవితాశయం పెట్టుకున్నాడని తెలుసుకుని మరింత ప్రేమ పెంచేసుకుని ఏమన్నా సరే అతన్నే చేసుకుంటా అని తన అన్న కడపరెడ్డన్న కి చెపుతుంది అలా అయితే మన అంతస్తుకు తగట్టు గా కనీసం నెల లోపు పది కోట్లు సంపాయించి చూపిస్తే అలాగే వప్పుకుంటా నంటాడు ,దానికి హీరో పదికోట్లకి నెల ఎందుకు రా పది నిమిషాల్లో పల్లీలు అమ్మి సంపాయిస్తా అంటూ కలర్ వేసిన మీసాన్ని గట్టి గా తిప్పి అదే చేత్తో తోడ మీద కొట్టి ఆ కలర్ మసి తెల్లపంచి మీద కనబడ్డా సరే సింగెల్ షాట్ వొకే అంటూ రాయల సీమ లో వెళ్ళే అన్ని ట్రైన్స్ మీద పడతాడు . అయితే హీరో గతం లో రాయల సీమ లో పెద్ద పేరుమోసిన ఫాక్షనిస్ట్టు కొన్ని కారణాల వాళ్ళ హైదరాబాద్ వచ్చేసి గుట్టు గా పల్లీలు అమ్ముకుని బతుకు తుంటే ఇప్పుడు ప్రేమ పేరు తో బయట పడవలసి వస్తుంది అతని వల్ల ఇంతకూ ముందు లబ్ది పొందిన వాళ్ళు ఈ విషయం తెలుసుకుని వొక ప్రత్యేకమైన రైలు వేసుకుని వెయ్యిమంది వచ్చి పదినిమిషాల్లో పల్లి వోక్కొక్కటి లక్ష రూపాయలకి కొనుక్కుని చక్కా వెళ్లి పోతారు.కదా సుఖంత మవుతుంది.
అది చూసి ఇంస్పిర్ అయిపోయి హాసిని రొజూ తను వెళ్ళే ట్రైన్ లో పల్లిలమ్మే అబ్బాయికి లైన్ వేసి పది రోజుల్లో ఐ లవ్ యు అంటుంది .దానికి పల్లీల వాడు కొండ కి వెంట్రు కేసా వస్తే కొండ పొతే వెంట్రుక అని మనసులో అనుకుని ఐ పెంటా అంటాడు .అదేంటి ఎవరన్న ఐ టూ అంటారు నువ్వేంటి అసహ్యం గా అంది హాసిని .
ఏవండి ఐ టూ అంతే నా ప్రత్యేకత ఏంటి ?నేను వొక కవున్ కిస్కా గొట్టం ఐ త్రీ , ఐ టెట్రా ఐ పెంటా అన్న మాట అనగానే ఫ్లాట్ అయి పోయి ఆర్య సమాజం లో పెళ్ళికి ముహూర్తం పెట్టేసుకుని రెడీ అయిపోతోంది .ఇక్కడ అల్లా అవుతుంటే అక్కడ తరణి హత్య కాబడటానికి వీలు కలిపించిన పరిస్తితులు తెలుసు కోవాలంటే మళ్ళి నేనుఆ ఊరులో వున్నప్పుడు నాకు తెలీకుండా అయిన ఘటనలు తెలుసుకోవాలి అందుకు ఇంకో రెండు రోజులు వోపిక పట్టాలి .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)