
ముందు మాట; ఈ కధ ఎవర్ని వుద్దేశించి రాయనప్పటికి స్వభావ రీత్యా తమనే వుద్దేశించి రాసానేమో అనుకుంటే నాకు కొత్తగా వచ్చిన నష్టం ఏమీలేదు వాళ్ళ వుడుకుమోతు తనం తప్ప.ఇంక కధ లోకి వస్తే అరుంధతి రెండోభాగం తీస్తే ఎలా వుంటుందన్న దానికి వుహ రూపమే మన కధ.
బొమ్మాలి బెంబేలెత్తి పోతూ ఉంటుంది.ఆ పశుపతి ని ఎలాగైనా పాడే ఎక్కించాలని .ఎందుకంటె ప్రతిసారి పశుపతి వదిలేసినట్టే కనబడుతూ మళ్ళి దాడికి దిగుతున్నాడు. దీనికీ పరిష్కారం ఏంటని తన అఘోరి బృందాన్ని ముందు రోజే సంప్రదిస్తున్డి. అందులో వృద్ద అఘోరి బాబా నువ్వు మూసి నది వొడ్డున అర్దరాత్రి పందికొక్కుల వేపుడు లో నరమాంసం బిరియాని వండుకుని మీ చెలికత్తెలతో కలిసి ఆ కంపుని ఆస్వాదిస్తూ పశుపతి నామ స్మరణ చేస్తూ పశుపతి వశం కరం అంటు నూటొక్క సార్లు ఆ కుళ్ళు కూపం లో పొర్లి ఆ నరమంసాన్ని ముక్క కూడా మిగల్చకుండా లాగిస్తేనే ఆ పశుపతి వశం అవుతాడు చిన్న ముక్క ని వదిలేసిన మళ్ళి కాష్మోరా బృందం తో దాడి చేసి ఏడు జన్మల పాపాలు బయటకు తీసి మళ్ళి నీ మొదటి జన్మ అయిన కోతి లా మార్చేస్తాడు అని చెప్తాడు.అప్పుడు బొమ్మాలి ''ఇంకా అర్దరాత్రి అవదేమి ఈ వెలుతురు చెదిరి పోదేమి ' అని పాడుకుంటూ తన చెలికత్తెల్ని తీసుకుని మూసి వైపు నడుస్తూ వుంటుంది.ఇంతలొ బొమ్మాలి ''అదే వాసన ,అదే కంపు నా నాసికలకి అదే ఇంపు 'అంటు ఒక చోట ఆగి పోయి మూసి వచ్చేసిందేమో నే అంటుంది చెలికత్తెలతో .నీ మొహం ఇది ట్యాంక్ బండ్ మూసి ఇంకా ఎన్నో కోసుల దూరం నడవాలి నీతో వస్తే ఇదే తంటా సోడా కూడా తాగిపించకుండా ఆమడ దూరం నడిపిస్తావు అంటారు. అబ్బమనం తిన బోయేది పందికొక్కు వేపుడు , నరమాంసం బిరియాని యెంత ఆకలి దాచుకుంటే అంత బాగా తినొచ్చు ఒక్క ముక్క కూడా వదలకుడదని అ వృద్ద అఘోరి బాబా చెప్పారు మర్చి పోయారా అంటు వాళ్ళని హుషారు చేస్తూ మాటల్లో పెట్టి మూసి దాకా లాక్కోస్తున్డి . అప్పటికే ఉస్మానియా మార్చురీ లో కుక్కలు పిక్కు తిని వదిలేసిన రెండు మూడు శవాల్ని ఒక బాడీ గా కుట్టేసి watchman వోబులేసు మందు కి ప్రలోభపడి పోయి బొమ్మాలి కి అంట గట్టేస్తాడు.ఆశవాన్ని దోరగా వేయించుకుని బిరియనికి సిద్దం చేస్తూ వుంటారు చెలి కత్తెలు . అదే వాసన అదే కంపు అంటు బొమ్మాలి ఉండి ఉండి ఒక సారి మూసి నది లో ముక్కు పెట్టి మరీ వస్తూ వుంటుంది.ఈ లోపే చెలి కత్తెలు కాలు నాది ,చెయ్యి నాది ,పీక నాది అంటూ కాట్ల కుక్కల లా పిక్కుని తినేస్తూ వుంటారు. దూరం నుంచి రెండు కళ్లు వాళ్ళని గమ నిస్తున్నాయని ఆ క్షణం లో వాళ్ళకి తెలిదు.బొమ్మాలి ఆబగా నర బిరియాని తిందామని వచ్చే టైం కి పంది కొక్కు వేపుడు తప్ప ఏమి లేదు .ఆ పశుపతి నీ జయించాలంటే వశీకరణ మంత్రం చదువుతూ మూసి కంపుని ఆస్వాదిస్తూ నక్క ల వుల్లనే బజన్త్రిలుగా భావిస్తూ వొక్క ముక్క కూడా వదలకుండా బొక్కలు తినక పొతే ఇంతా చేసింది బొక్కే .మూసి కంపు అస్వాదనకే అలవాటు పడ్డ బొమ్మాలి నాసికలు మిగత విషయాలు మర్చి పోవడం తో ఘోరమైన తప్పు తో రెండు మూడు శవాల్ని ఒకటి గా భావించి లాగించడం తో ఆ దూరం నుంచి గమనిస్తున్న కళ్లు చింత నిప్పుల ఎర్ర గా భగ భగ మన్డాయి . అవే కాల భైరవ కళ్లు .ఒక్క సారి భయంకరమైన రంకె ఆ రంకె తో పుర్రెలో మూసి నీళ్ళు పోసుకుని జుర్రు కొంటున్న బొమ్మాలి వెన్ను లో వణుకు మొదలైంది.అమ్మో తను మింగడం లో వున్న శ్రద్ద మంత్రం పలకడం లో చూపలేక పోయానే ఇప్పుడు నా కేది దారి ఈ పశుపతి గాన్ని లొంగ దీసుకున్దమనుకుంటే అనవసరం గా కాలభైరవుడి కోపానికి గురి కావలసి వచ్చినదే అనుకుంటూ చెలి కత్తెల కోసం చూస్తే ఇంకెక్కడి చెలి కత్తెలు ఎప్పుడో లగెత్తెసి పశుపతయ నమః అనుకుంటూ పారి పోతూ కని పించారు.ఇప్పుదేడి కర్తవ్యం మనుటయా ?, మరణించు టయ? అనుకుంటూ ''చరిత్ర ఎరుగని మహాపాతకం నా మనసునకే వచ్చిందా ? , ఎవరో ఎందుకీ రీతి సాధింతురు ఎవరో ఏల పగ బూని సాధింతురు అంటూ తను ఈ మద్యనే చదువుకున్న పాటల్ని పాడుకుంటూ పరిగెడుతూ పోతుంటే విశ్రాంతి కార్డు పడుతుంది . ఇది ''చార్మినార్ తాగు సమయము '' అంటూ పెద్ద హార్డింగ్ మీదకి కెమెరా జూం అవుతుంది.(మిగత భాగం మళ్ళి నవ్వుకోవాలని పించినప్పుడు ) )