24 సెప్టెం, 2011

మల్లీశ్వరి కాదు


యింతకు ముందు వొక పోస్ట్ లో రాసాను''కరణంమల్లిస్వరేనా ?''అని కరణం మల్లీశ్వరి పేరు తో నా సెల్ కి కాల్ వచ్చిందని . ఆమె నిజం గా మల్లిస్వరో కాదో అని అనుమానిస్తూనే ఆమె పని చేసి పెట్టానని .ఆమె ఆమె కాదో అవునో ప్రోబ్ చెయ్యాలని .అంతటి తో ఆ విషయం మర్చి పోయా పని వత్తిడి వాళ్ళ యింక ద్రుష్టి సారించలేదు .అనుకోకుండా ఆఫీసు పని మీద మొన్న గురువారం ఢిల్లీ వెళ్ళ వలసి వచ్చింది . వెళ్ళిన పని వొక పూటలోనే అయిపోవడం తో పాలిక బజార్ లో తిరుగుతూ కరణం మల్లీశ్వరి నెంబర్ గుర్తుకు వచ్చి ఆమె కి సంక్షిప్త సమాచారం పంపా . అయాం అట్ ఢిల్లీ అని . ఎందుకంటె యింతకు ముందు ఆమె రెండో సారి కాల్ చేసి ఈ సారి ఢిల్లీ వస్తే మా యింటికి రండి అని ఆహ్వానించింది .నేనుకున్నది ఏంటంటే ఆమె వెంటనే కాల్ చేసి మా ఇల్లు ఫలానా ప్లేస్ లో వుంది మీరు రండి అని ఆహ్వానిస్తుందని . కాల్ లేదు నా సందేశానికి స్పందన లేదు .మా మిసెస్ కజిన్ వొక ఆమె నుంచి ఢిల్లీ ఎప్పు డెల్లారు ? హవె అ గుడ్ టైం అని సందేశం వచ్చింది .యింకో ఫ్రెండ్ మీరు ఢిల్లీ వెళ్ళినా మా దిల్లు లోనే వున్నారని .ఇదేంటి యిలా జనాలందరికీ మన ఢిల్లీ ట్రిప్ ఎలా తెలిసిందా అని చూసుకుంటే అంతకు ముందు వినాయక చవితి శుభాకంక్షల సందేశాన్ని కరణం మల్లీశ్వరి తో పాటు మరి కొంత మంది మిత్రులకి పంపా . మళ్ళి అదే మేస్సజ్ ఓపెన్ చేసి నా ఢిల్లీ సందేశం పంపితే అది మొత్తం అందరికి వెళ్లి పోయింది .నిన్న ఢిల్లీ నుంచి వచ్చేసి నా పని లో పడి పొతే , యిప్పుడే కరణం మల్లీశ్వరి సెల్ నెంబర్ నుంచి ఫోన్ చేసి హిందీ లో మీరెవరు ఢిల్లీ లో వున్నాను అని సందేశం వచ్చిందని అడిగింది .హమ్మ వెతక బోయిన తీగ కాలికి దొరికిందని నేను కూడా నేనెవరో చెప్పకుండా మీ స్నేహితున్ని కూడా గుర్తు పట్టలేరా ?అని గాలి లో బాణం వేసా . యింతకీ మీరెవరు అన్నా . అంతే కావలిసిన సమాధానం వచ్చేసింది . తన పేరు ఫలానా రెడ్డి(అంటే ఆమె పేరు ఫలానా రెడ్డి అని కాదు గోప్యత కోసం ఎస్ తో మొదలయ్యే మూడు అక్షరాల పేరు ని రాయలేదు )అని తెలుగు అమ్మాయినని చెప్పి మీరెవరో చెప్పండి అంది .అంతే నండి సాయం కావలిసి వచ్చినప్పుడు నా పేరు తో సహా ఉద్యోగ వివరాలు చెపుతారు పని అయిపోయాక కనీసం ఆ నెంబర్ కూడా సేవ్ చేసుకోరు . యిక నుంచి నేను మీ అజనభి కభి అల్విద నా కహేనా అని పెట్టేసా .యింక పొడిగిస్తే తాళం తప్పి పక్క దారి పట్టొచ్చని . . యింతకీ నా కర్దంయ్యింది ఏంటంటే ఈ ఫలానా రెడ్డి విశాఖ పట్నం లో పని చేస్తోంది ఆమె కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావాలి .కరణం మల్లీశ్వరి పేరు తో చేసినప్పుడు ఆమె అడిగిన సాయం చేసినప్పుడే యిలా ఫలానా రెడ్డి మంచి క్రీడాకారిణి హైదరాబాద్ లో వుంటే ఆమె కి తగిన గుర్తింపు వస్తుంది అందుకు ఆమెని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించండి అంటే చూద్దాం లెండి అని ఊరుకున్నా . యిప్పుడు ఆమె ఫోన్ లో తన పేరు చెప్పగానే అర్ధం అయ్యిపోయింది ఈ కరణం మల్లిస్వరే ఫలానా రెడ్డి అని . అయితే ఆమె నా నెంబర్ డిలీట్ చేసెయ్యడానికి బహుశా నేనుకునే కారణం ఆమే కొన్ని రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు మీరు కరణం మల్లీశ్వరి కాదని నాకు తెలుసు లెండి , ఆమె వాయిస్ ని నేను నెట్ లో విన్నాను మీ యిద్దరి గొంతులకి పొంతన లేదు మీకేమి కావాలో చెప్పండి అంటే లేదండి హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తా అప్పుడు నమ్ముదురు అని పెట్టేసింది . కని పెట్టేసానని డిలీట్ చేసి ఉండొచ్చు .
ఫైనల్ గా నే చెప్పేదేమంటే సెల్ లో నేను ఫలానా అని చెప్పే ప్రతి వాళ్ళు ఫలానా కాక పోవచ్చు మనం వాళ్లే అనుకుని ఉబ్బి తబ్బిబు అయిపోయి బ్రమల్లో ఉండకుండా , సెల్ లో అయినా చాట్ లో అయినా వారి చాటు మాటు విషయాల్ని కని బెట్టక పొతే ముందు మన తెర చాటు విషయాలు వాళ్ళు కని బెట్టేసి మనం వాళ్లతో మాట్లాడుతున్నది వాళ్లతో సహా ఏ టీవి నైన్ లోనే మన కుటుంబ సబ్యులతో సహా అందరు వినే అవకాశం ఎప్పుడు వుంటుంది . తస్మాత్ జాగర్త .

17 సెప్టెం, 2011

అవధూతలు వుంటారు

మొన్న ఏదో పని మీద అమలాపురం వెళ్ళవలసి వచ్చింది .ఎప్పటి నుంచో మా సీనియర్ సహచరుడు వొక ఆయన అక్కడికి వెళ్లి నప్పుడు వీలుంటే దగ్గరలో ఐనవల్లి దగ్గర మూలపోలం అని వొక వూరు వుంది అక్కడ వెంకన్నబాబు అని వొక స్వామి వున్నారు మనిషిని చూడగానే మనసులో వున్నది చెప్పేస్తారు .మీరనుకున్తున్నది అవుతుందో లేదో కూడా చెప్పేస్తారు .ప్రయత్నించండి అన్నారు .యిది చెప్పి కూడా నాలుగేళ్ళ పైన అయిపొయింది .మేము వెళ్ళిన పని తొందరగా అయిపోవడం తో ఆ పని అవడం లో సహకరించిన పెద్ద మనిషిని యధాలాపం గా అడిగా మూలపోలం ఎక్కడో తెలుసా అని పెద్ద ఆశలు ఏవి పెట్టుకోకుండా . ఎందుకంటె అంతకు ముందే మా కార్ డ్రైవర్ ని అడిగితె తెల్ల మొహం వేసాడు .వెంటనే ఆయన సార్ నేనెప్పుడో యిరవై రెండేళ్ళ క్రితం వెళ్ళా మీకభ్యంతరం లేక పొతే నేను వస్తా అంటే మా ఫ్యామిలీ తో పాటే ఆయన కూడా డ్రైవర్ కి దారి చూపిస్తూ మద్యలో కనుక్కుంటూ చివరికి మద్యాన్నం మూడు గంటలకి వారింటికి చేరు కున్నాము .శనివారం , ఆదివారం ,మంగళవారం మాత్రమె ఆయన స్వామి ఆవాహన పొంది పూజా పీటం లో ఆహుతుల మనసులో ప్రశ్నలకి సమాధానం చెపుతారు . ఆ రోజు మంగళవారం అవడం తో అప్పటికే హాల్ నిండా వొక యాభై మంది దాక కుర్చుని వున్నారు .నా విసిటింగ్ కార్డు పంపడం తో కొంతసేపటి తర్వాత మా కుటుంబాన్ని ప్రత్యేకం గా వేరే గదిలో కూర్చో బెట్టారు .అక్కడ గొప్పతనం మన హోదా దీ కాదు వేంకటేశుని అనుగ్రహమే అని తర్వాత నాకు అర్ధంఅయ్యింది .ఆ గది లోకి కూడా యింకో మూడు నాలుగు కుటుంబాలు (చుట్టుపక్కల గ్రామాల్లో ప్రముఖులు )వచ్చి చేరాయి .అక్కడ గదిలో గోడలకి వేలాడదిసిన స్వామి ఫోటోల పక్కన పసుపుబట్టలతో వున్న యియన ఫోటోలు కూడా కని పిస్తే మా శ్రీమతి ఉండబట్టలేక ఏంటో వీళ్ళంతా దేవుడి తో సమానం గా ఫోటోలు పెట్టేసుకుంటారు వీళ్ళు కూడా దేవుడంతా గొప్ప వాళ్ళని అనుకుంటారా అని మెల్లగా అంది .టైం అప్పటి కే అయిదయింది . అయన బయటకు రాలేదు . నా కేమో రాజముండ్రి వెళ్లి గౌతమి పట్టుకోవాలి ట్రైన్ మిస్సవుతుందేమో అని భయం .చివరికి అయిదు ఇరవైకి పొట్టి గా చామన చాయ కలర్ తో పసుపు బట్టలతో సాధారణ వ్యక్తీ లా అనిపించే వ్యక్తీ వచ్చారు .అందరు ఆయన కి నమస్కరించి ఆశ్వేర్వచనం పొందు తుంటే నన్ను నేను పరిచయం చేసుకుని ఎప్పటి నుంచో రావాలనుకుంటే యిప్పటికి కుదిరిందని చెప్పా . దానికి ఆయన చిరునవ్వుతో స్వామి అనుకున్నప్పుడే అనుసంధానం చేస్తారు మీరు లోపల పూజా మందిరం లో ప్రశ్నకి సమాధానం విని వెళ్ళండి అన్నారు .యింక ఏమైతే అది కాని ట్రైన్ మిస్ అయితే మిస్ అవని విని వెళదామని ఆగాము . అక్కడ పూజ మందిరం లో వెంకటేశ్వర విగ్రహం అమ వారి విగ్రహాలు చక్క గా దండలతో అలంకరించ బడి వున్నాయి .అక్కడి వాత వరణం లో కూడా ఏదో శక్తి వున్న అనుభూతి కల్గింది.ముందుగా మమ్మల్ని పూజా మందిరం లోకి పిలచి తీర్దం యిచ్చారు . వెనకే మిగతా వాళ్ళు కూడా వచ్చి చేరారు . కొద్ది సేపటికే ఆ గది ఇరుకు గా మారి చిన్నప్పటి తోపులాటకి సిద్దం గా మారింది .యింకా హాల్ లో జనం మేమెప్పుడు బయట కోస్తామా వాళ్ళు దూరోచ్చని చూస్తున్నారు .యింతలో ఆయన కళ్ళు మూసుకుని దండం చేత్తో పట్టుకుని తన ఎదురు గా వున్న ఆమెతో ''ఏమి ఆశించి వచ్చావు స్వామి దగ్గరకి ?అనారోగ్యం తో బాధ పడుతున్న నీ కొడుకు ఆరోగ్యం గురుంచి వచ్చావా ?యింకా నలుగురు డాక్టర్లు మారాక తగ్గుతుంది . పూర్వ జన్మ ప్రారబ్దం అనుభవిస్తున్నాడు .సహనం వహించు నే చూసుకుంటా వెళ్లిరా '' అనగానే ఆమె ఆనంద భాస్పాలో కళ్ళ నిళ్లో తెలీని స్తితి లో తుడుచుకుంటూ ముందుకు జరిగింది . ఆమె వెనక వచ్చిన అతనికి నీ వ్యాపార విషయం లో ఆందోళన చెందకు ఆరు నెలల్లో అంతా సద్దుకుంటుందని చెప్పడం జరిగింది .
అలా జనం వోకర్ని వొకరు తోసుకుంటూ ఆయన ముందుకు వస్తుంటే ఆయన వాళ్ళకేసి చూస్తూ మనసులో మాటని చదువుతూ పరిష్కారం చెపుతున్నారు .యింక నా వంతు వచ్చింది .స్వామి శక్తి రూపమా ?విష్ణు రూపమా ?అని ఆలోచిస్తున్నావు (నా బుర్రలో ఈ సందేహం ఎప్పటి నుంచో వుంది స్వామికి శుక్ర వారం అభిషేకం చెయ్యడం లో అర్ధం శక్తి రూపమే అని )ఆది శక్తి శివ శక్తి రెండు నేనే .నీ పూజలు అలాగే కోన సాగించు .నీ మంచి మనసు ,ఇతరులకి సహాయ పడే గుణాన్ని బట్టే నీకు ఉద్యోగం లో మార్పు వచ్చింది .అందులో మంచే జరుగుతుంది . నీకు డిసెంబర్ రెండో వారం లోపు పదోన్నతి వస్తుంది .వెళ్లి రా . అని చెపుతుంటే నా కళ్ళలో ఆనంద భాష్పాలు జల జలా రాలాయి .ఎందుకంటె నేను నోరు తెరచి ఆయనని ఏమి అడగ లేదు . అదికాక యి విషయాలు యిన్కేవరి తోనూ చర్చించలేదు . అందుకే వొక విధమైన ట్రాన్స్ లోకి వెళ్లి పోయి బయటకు వచ్చా . మా శ్రీమతి విషయం లో కూడా నీ దగ్గర మోసపురితం గా వొకడు డబ్బు తీసుకున్నాడు అది నీకు మార్చి లో వస్తుందని చెప్పినప్పుడు ఆశ్చర్య పోవడం ఆమె వంతయ్యింది . ప్రస్తుతం ఆ వివాదం కోర్టు లో నడుస్తూ మా కనుకూలం గా తీర్పు వచ్చింది .ఆయన గురించి మా తో పాటు వచ్చినాయన ద్వార మరిన్ని విషయాలు తెలుసు కున్నాము . ఆయన చాలా ఏళ్ళ క్రితం నుంచే అవధూత లా వ్యవహరిస్తున్నారని బ్రహ్మ చారి లా వుంటూ తన దగ్గరికి వచ్చే వాళ్ళ యితి భాధలు తీరుస్తున్నారని చెప్పాడు .అయితే ఆయన శిష్య గణం కొంత అతి గా వ్యవహరిస్తున్నరేమో అని పించింది .వొక పక్క యియన ప్రశ్న సమాధానం చెపుతూ వుంటే గట్టి గా అరుస్తూ జనాల్ని కంట్రోల్ చెయ్యడం , మాట్లాడడం వంటివి చెయ్యడం జనాలు పళ్ళెం లో వంద అయిదు వందల నోట్లు వెయ్యగానే తీసి బిందె లాంటి హుండీ లో వెయ్యడం వంటివి .అవధూతల దగ్గర శిష్యగణం వారి మహిమల్ని ధన రూపం లోకి మారుస్తూ వుంటారేమో ?
ఈ ట్రిప్ లో నాకర్ధమయ్యింది ఏమిటంటే అవధూతలు అక్కడక్కడ యింకా వున్నారు వాళ్లతో అనుసంధానం అయ్యే సమయం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తారు .మరి అంతవరకూ మేర నంబర్ కబ్ ఆయే గా అనుకోవడమే .