3 ఏప్రి, 2011

దేవుడికే రోగం వస్తే ?


గత వారం రోజులు గా సత్య సాయిబాబా ఆరోగ్యం ఆందోళన కరం గా మారి ఆయన అయి సి యు లో వెంటి లెటర్ మీద వున్నారని వినప్పుడు నా మనసులో కలిగిన వివిధ రకాల ఆలోచనలకి అక్షర రూపం యిద్దామని ఈ ప్రయత్నం .అలా అని నేనేమి బాబా భక్తున్నో లేదావిమర్సకున్నో కాదు .ఎంతో మంది భక్తులకి ఆరాధ్య దైవం గా నిలిచి వాళ్ళు అనారోగ్యం తో బాధ పడుతునప్పుడు ఆయన మీద ఉంచిన నమ్మకం తో తిరిగి కోలుకున్న వాళ్ళు నేడు అదే దైవం జీవన పోరాటం చేస్తూ వుంటే యెంత ఆందోళనకి గురవుతారో కదా ?ఆయన ఎవర్ని ప్రార్ధించి ఈ గండం నుంచి బయట పడతారో ?ఆ వయసులో వెంటి లెటర్ నుంచి వీన్ అయ్యి బయట పడడం కేవలం దైవ అనుగ్రహం తోనే సాద్యం .పేస్ మేకర్ అమర్చడం అంటే పెద్ద ఆపరేషన్ .అయి సి యు లోనే చాల రోజులు నిరంతర పర్య వేక్షణలో ఉండాల్సి వుంటుంది .ఆయన దేవుడా కాదా అన్నది పక్కన పెడితే వొక మంచి మానవతా వాది అనంతపూర్ చుట్టుపక్కల తాగు నీరు అందించడం లో అయన చొరవ ప్రశంస నీయం .వొక సారి పుట్ట పర్తి కి అఫీషియల్ గా వెళ్ళినప్పుడు ఆయన నా వద్దకు వచ్చి విభూది యివ్వడం మంచి పని చేస్తున్నారు బంగారం అనడం వరకే నా పరిచయం .పాపం ఈ వయసులో ఆయన శరీరానికి యెంత కష్టమో ?తిండి నిద్ర కూడా వుండవు . నాలో కలిగిన సందేహాలు ఏంటంటే యిన్నాళ్ళు ఆయన జుట్టు అంత నిగ నిగ లాడుతూ నల్ల గా వుండడం ప్రకృతి సహజమా కాదా ?అన్నది యిప్పుడు బయట పడుతుంది .ఎందుకంటె ఆయనున్న పరిస్తితులలో ఆర్టిఫిషియల్ అలంకరణలు అసాద్యం .యింక రెండోది గడ్డం పెరిగి (నలుపో . తెలుపో ) కొత్త రూపు లో ఆయన కని పిస్తార్రు . కాని ఆ ఫోటోలో బయటకు వచ్చే అవకాశాలు తక్కువే .నా చినప్పుడు సాయిబాబా భక్తుల ఇళ్ళలో ఫోటోల నుంచి విబూది రావడం చూసాను .ఆయన మహిమాన్వితుడే కావచ్చు గాని నరుడు గా పుడితే నారాయణుడే నానా భాధలు పడవలసిందేమో ?నిరంతరం నిపుణులైన డాక్టర్స్ పర్య వేక్షణలో ఆయన వుండడం దైవ అనుగ్రహమే . అలా గే యిన్నాళ్ళు తమను కాపాడిన దైవాన్ని కాపాడే అదృష్టం తమకు కలిగిందని అంకిత భావం తో పని చేసే సిబ్బందే ఆయనకు శ్రీ రామ రక్షా.మహనీయులకి సునాయాస మరణమే అంటారు కాబట్టి ఈ పోరాటం లో అయన విజయం సాధిస్తారని నవంబర్ లో తన పుట్టిన రోజును జరుపు కుంటారని ఆశిద్దాం .

30 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఆయన తను 96 ఏళ్ళు జీవిస్తానని చాలా సార్లు చెప్పాడు లెండి! చూద్దాం

చెప్పారు...

బాగా చెప్పారు. అయన అందరికి దేవుడో కాదో కానీ, అనంతపురం చుట్టుపక్కల ప్రజలకు దేవుడు, నీళ్ళ దేముడు. కాని వాళ్ళలో ఎక్కువమంది ఆయనను నమ్మరు. అక్కడ ఫ్రోరైడ్ నీళ్ళు ఒక నెల రోజులు తాగితే అయన ఎంత దేముడో అర్ధమవుతుంది. :-)

దేముడని కాదు కానీ సాటి మనిషి అనారోగ్యం తో బాధ పడుతుంటే గేలి చేయకూడదు.

ఇంతకీ నేను అయన భక్తుడను కాను. ఆయన ఇచ్చే ఉంగరాలని చైన్లని లింగాలని ... వ్యతిరేకిన్చేవాడిని.

అజ్ఞాత చెప్పారు...

టపా బాగుంది. కానీ ’దేవుడికే రోగం వస్తే; అనే శీర్షిక బాగాలేదు.

అజ్ఞాత చెప్పారు...

*ఆయన ఇచ్చే ఉంగరాలని చైన్లని లింగాలని ... వ్యతిరేకిన్చేవాడిని*

ఆయన అవి ఇస్తే మీకు వచ్చే నష్టమేమిటి? చాలా మంది అదేదో పెద్ద తప్పు అయినట్లు భావిస్తారు. ఆయన భక్తులకు ఇచ్చాడేకాని, వారి ఆస్థులు మొత్తం తీసుకొని బికారులను చేయలేదు కదా! ఇక ఆయనకి ఇచ్చిన వారు స్వచ్చందంగానే ఇచ్చారు.

కమల్ చెప్పారు...

బాబా గురించి చాలానే పుకార్లున్నాయి.. దూరపు కొండలు నునుపు అన్న సామెతలాగ ఆయన చుట్టుపక్కల ఉన్న వూరు వాళ్లే ఆయనను నమ్మరు.. దూరంగ ఉన్న అందరూ నమ్ముతారు..! అక్కడున్న వారు నమ్మకపోవడానికి కారణం ఆయన మాంచి వయసులో ఉన్నప్పుడు చేసిన " ఘనకార్యాలు " అన్నిటికి వారు సాక్షులు కాబట్టి. బాబా గారి గురించి నిజాలు తెలుసుకోవాలంటే ఆ ప్రాంతంలో కొన్ని ఏళ్లు ఎస్.పి గా పని చేసి తర్వాత ఐ.జి గా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫర్ నక్సలైట్స్ విభాగంలో పని చేసి రిటైర్ అయిన వీరనారాయణరెడ్డి గారిని కలిస్తే, పుట్టపర్తి.. అక్కడి చీకటి కోణాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నారు బంజార హిల్స్‌లో.

చెప్పారు...

@శ్రీకర్
సాయి బాబా నిజంగా సృష్టించి ఇచ్చిన నాకు ఏమి ప్రాబ్లం లేదు. కాని ఇలాంటివి ప్రతి దొంగ బాబాకి రెఫెరెన్సు. దొంగాబబాల అల్టిమేట్ గోల్ సాయిబాబా. ఎప్పటికయినా అంతా ఎత్తు ఎదగాలని ... దీనంతటికి కారణం అయన మాయలు అన్న ట్రిక్స్ చూపటం.

2G కుంభకోణంలో నా బ్యాంకు ఎకౌంటు లోనుంచి డబ్బులు పోలేదు అని నేను పట్టించుకోనా?

Sudha Rani Pantula చెప్పారు...

మీకు ఆయన మీద ప్రత్యేకమైన నమ్మకం లేకపోయినా లేదా అగౌరవం కూడా లేకపోయినా మీ టపాకి ఆ శీర్షిక మరోలా పెట్టిఉండవలసినది.మీకు నమ్మకం అసలే లేనప్పుడు సరే. సాటి మనిషి అనారోగ్యంతో బాధ పడుతుంటే గేలి చేస్తున్నట్టు...అవును.అలాగే అనిపిస్తోంది టపా శీర్షిక చదివితే.

@సాధారణ పౌరుడు
2G కుంభకోణంలో నా బ్యాంకు ఎకౌంటు లోనుంచి డబ్బులు పోలేదు అని నేను పట్టించుకోనా?
బాగా చెప్పారు.

Rao S Lakkaraju చెప్పారు...

సుధ గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.సాటి మనిషి బాధపడుతుంటే హేళన చెయ్యటం ఏదో లేమిని చాటి చెబుతోంది.

అజ్ఞాత చెప్పారు...

మీ టపా వ్యంగంగా వుంది. ఆయన భక్తుణ్ణి కాను, ఒకప్పుడు ఆయనపై తిరస్కార భావం వున్న వాడినే. తరువాత తరువాత అర్థమయ్యిందేమంటే ఆయన ఒక్క అనంతపురమే కాదు, కర్నాటక, తమిల్నాడు, చిత్తూరు ప్రాంతాల్లో కూడా రక్షిత మంచినీటి సరఫరా, స్కూళ్ళు, ఆడపిల్లల చదువుకోసం కాలేజీలకు ఆర్థిక సహాయం చేశారు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టించారు. నాస్థికవాదులం అని విసుగూ విరామం లేకుండా గంట కొట్టి చెప్పుకునే వాళ్ళు ఎంత మంది అలాంటి మంచి పనులు చేస్తున్నారు అని ఆలోచిస్తే చాలా తక్కువ అనిపించినప్పుడు, నాకు ఆయన పట్ల గౌరవభావం ఏర్పడింది. అలా అని గారడి విద్యలు నమ్మను, అవి ఏదో సరదాగా జనాకర్షణగా తీసుకుంటాను. వైఎస్ఆర్, సిబిఎన్ వేల కోట్లు తిన్నారు ఏదే తమ సంపాదనలోంచి ఒక్క రూపాయ విదిల్చారా? ఈ అవినీతి పరులకు రాష్ట్రం మొత్తం విగ్రహాలు పెట్టంగా లేనిది, ఆ మంచి మనిషి(దేవుడనుకోకున్నా) ఆరోగ్యం కోసం ప్రార్థిస్తే తప్పేంటి? అందుకే నమ్మకం లేకున్నా, అనంతపౌరుడిగా కనీసం తెలుసుకోవడం ధర్మమని, చాలా ఏళ్ళ ఆయన్ను చూట్టానికి రెండేళ్ళక్రితం ప్రత్యేకంగా పుట్టపర్తికి వెళ్ళి వచ్చాను, చూశాను. కుగ్రామమైన పుట్టిన వూరిపై ప్రేమతో ప్రశాంతమైన చోటుగా మార్చారు, అక్కడే మరణించాలని కోరుకుంటున్నారు. చాలా మంది ఎక్కడేక్కడినుంచో రిటైరీలు దేశవిదేశీయులు అక్కడ ఇళ్ళు కట్టుకుని ప్రశాంతంగా వున్నారు. ఒక వ్యక్తిగా చూస్తే కూడా, ఓ చదువురాని పల్లెటూరి వ్యక్తి అంత ఎత్తుకు ఎదగడం.. ఆ జీవితం ధన్యమైందా, కాదా? అని ఒక్క క్షణం ఆలోచిస్తే ... ఏ కోటికో ఒక్కడు కూడా అరుదే అనిపిస్తుంది.

Yes! I wonder bushy dark hair of this old man! ;) :) A well kept secret indeed!

I agree with Sreekar.

/ఆయన ఇచ్చే ఉంగరాలని చైన్లని లింగాలని ... వ్యతిరేకిన్చేవాడిని./
I am no stupid, I welcome any such golden gifts :P :)

అజ్ఞాత చెప్పారు...

*2జి కుంభకోణంలో నా బ్యాంకు ఎకౌంటు లోనుంచి డబ్బులు పోలేదు అని నేను పట్టించుకోనా?*

120 కోట్ల జనాభాగల దేశం లో 2జి ని పట్టించుకొంది సుబ్రమణ్య స్వామి లాంటి వారు ఒక పది మంది ఉంటారేమొ. ప్రింట్ మీడియా, టి వి మీడియా నుంచి అందరు దానిని సాధ్యమైంత వరకు తొక్కి పట్టాలని చూసినవారే. సుప్రిం కోర్ట్ ఆదేశాలవలన ఇక వీలుగాక దాని గురించి చెప్పటం మొదలు పెట్టారు. మీరు ఎమీ పట్టించుకొన్నారో నాకైతే తెలియదు. చూడబోతే పేపర్లో వచ్చిన 2జి న్యుస్ ని చదివి పట్టించుకున్నానని చంక్కలు గుద్దుకొంట్టున్నారని అనిపిస్తోంది. మీరు పటించుకొని ఎమీ చేశారో చెప్పండి? మీలాంటి వారంతా జే.పి. లాంటి ఆర్మ్ చైర్ మేధావుల కేటగిరిలోకి వస్తారు. ప్రజలకు తెలిసిన అవినితీని ఇలా రూపు మాపాలి అలా రూపు మాపాలి అని ఉపన్యాసాలు ఇవ్వటం. అవినితిని ఏ ఏ దేశాలు ఏ విధంగా అరికట్టాయో అని ఎకరువు పెట్టటం. వినేవారు టి వి చూసేవారు వీరికేదో చాలా జ్ణానం ఉందని ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. వీరు నిజంగా సమాజాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారని అనుకొంటారు. అంతే. కనీసం ఆంధ్ర ప్రదేశ్ లో వీరు ఎంత అరికట్టగలిగారు చెప్పరు. పట్టించుకోవటం అంటే సుబ్రమణ్య స్వామి లాగా ఉండాలి ఆయన ప్రధానమంత్రికి మొదటి నుంచి 2 జి విషయమై లేఖలు రాశారు. కనుకనే సుప్రిం కోర్ట్ ఇచ్చే ప్రతి ఆదేశం ఆయనకు మద్దతుగా వస్తున్నాది. నా దృష్ట్టిలో పట్టించుకోవటం అంటే బాబా మీద కేసులు వేసి కనీస పోరాటం చేయాలి.

SRI

అజ్ఞాత చెప్పారు...

* ఆయన మాంచి వయసులో ఉన్నప్పుడు చేసిన ఘనకార్యాలు *
ఏమై వుంటాయా ఘనకార్యాలు నాకు తెలిసి ఆడవారి తో సంబంధాలు, స్మగ్లింగ్, మాదక ద్రవ్యాలు, ఇంకా ప్రజలకి చెత్త ఇమెజ్ ని క్రియేట్ చేయాలంటే హోమో ఇంత కన్నా నాకు తెలిసి ఘనకార్యాల పట్టి నా దగ్గర లేదు. మీరు చెప్పే ఆరోపణలను కొట్టి వేయకుండా ఒక సారి బాబా వలన లాభ నష్ట్టాలు భారత దేశం లో జరిగే మిగతా సంఘటనల తో పోల్చి చూద్దాం. మొదట గోవా గురించి. ఒక్క సారి మీరు గోవా లాంటి చిన్న రాష్ట్రంలో టురిజం పేరుతో జరిగే వ్యాపారం చూడండి. నేను రేండు సంవత్సరాల క్రితం గోవా మీద ఒక వ్యాసం చదివాను. అందులో వారు రాసింది ఎమీటంటె పేరుకి గోవా భారతదేశం లో ఉన్నా దాని కంట్రోల్ చేసేది విదేశీ మాఫియా ముఠాలు అని కారణం అక్కడ ఉన్న హోటల్స్ అన్నిటిలోను వారి పెట్టుబడులు ఉన్నాయని. కొన్ని హోటల్స్ లో భారతీయులకి రూంలు ఇవ్వరని. రాష్ట్ర ప్రభుత్వంలో పైన నుంచి కిందవరకు మంత్రులు ఏ పార్టికి చెందిన వారైనా వారి మాట వినవలసిందే నని రాశారు. స్థానికులు ఈ కల్చరల్ చేంజ్ తట్టుకోలేక నిరసన తెలిపితే ఈ విదేసి ముఠాలు వారి నోరు నొక్కుతాయని, ప్రభుత్వం నిస్సహాయం గా ఎమీచేయలేదని రాశారు. మొత్తానికి అక్కడ ఎలెక్షన్ తప్పించి ఎక్కడ కూడాను రాజ్యాంగ పరమైన పాలన జరగటం లేదనే అర్థం వచ్చే విధంగా వ్యాసం రాశారు.
Goa education minister arrested at Mumbai airport
http://arabnews.com/world/article342413.ece
ఇక రెండవ వర్గం వారు మావోయిస్ట్లు. మావోయిస్ట్టుల మీద ఉత్తర ప్రదేష్ కి చెందిన మాజి డి జి పి ప్రకాష్ సింగ్ గారు ఒక పుస్తకం రాశారు. అది ఒకసారి చదివేది. మావోల మిలిటరి బడ్జేట్ 1500 కోట్లు అని పేపర్ లో రాసారు. ఇంత డబ్బులు ఉండే ఈసంస్త ఒకసారి మీరు ఆలోచిస్తె ఈ ఉద్యమం పుట్టిన ఆంధ్రాలో వీరు చేసిన డెవెలప్ మెంట్ ఎమీటీ? అసలికి ఎప్పుడు చూసినా ప్రభుత్వం మీద అసంత్రుప్తి వెళ్ళగక్కుతూ అన్నిటిని తగులబేట్టటం తప్పించి వీరు కట్టించినది ఎమైనా ఉందా? ఇన్ని ఏళ్ళ వారి ఉద్యమంలో వారు చేసిన అభివృద్ది ఎమీటీ? మావోలు ఎన్నివందల మందిని చంపారు? అసలికి వీరికి ఇంత డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయి అని ఆలోచించండి.
-----------------------------------ఇటువంటి వారితో పోలిస్తే బాబా దేవుడు కాక పోయినా, మీరు చెప్పిన ఘనకార్యాలు చేసినాడని అనుకొన్నా ఆయన వలన ప్రజలకు కలిగిన లాభంతో పోలిస్తే నష్ట్టం తక్కువే. ఒక వ్యక్తిగా ఆయన దేశ/రాయలసీమ సంస్క్రుతి ని గోవాలో మాదిరిగా లేదు. పేద ప్రజల కోసమని పుట్టిన పార్టిలులా 1500 కోట్ల బడ్జేట్ తో ప్రభుత్వాన్ని చాలేంజ్ చేసి వేలాది మంది మనుషులను చంపలేదు. ఆయన దగర ఉన్నడబ్బునివందల కోట్లు నీళ్ళ కొరకు ఇచ్చాడు, సుపర్ స్పేషాలిటి ఆసుపత్రులను కట్టించాడు. ఎప్పుడో వచ్చే, వస్తుందనుకొనే రాజ్యం కొరకు ఎంతో మందిని చంపే మావోలకన్నా ప్రస్తుతానికి ఎంతో మందికి ఉపయోగ పడే పనులు చేశాడు. ఇక ఆయన దేవుడనేది ఆయన ఫాలోయర్స్ కి గాని మీకు,నాకు కాదు గదా!

అజ్ఞాత చెప్పారు...

@శ్రీకర్

మంచి ఇంఫర్మేషన్ ఇచ్చారు, కానీ పోలిక మాత్రం కుదరలేదు. మావోలనూ, గోవా హోటల్ల ఓనర్లను దేవుల్లను చేసి ఎవరూ మొక్కడంలేదు కదా? ఎంతపెద్ద నేరస్థుడయినా ఇంకో నేరస్థుడి కంటే కొంచెం మంచివాడవ్వచ్చు, అలాంటివరిని దేవుళ్ళు చెయ్యడం ఎందుకట?

కమల్ చెప్పారు...

ఇక్కడ వ్యాసం వ్రాసింది బాబా గారి గురించి కదా!! మన బ్లాగ్‌లోకంలో ఒక గొర్రెదాటు రోగం కనపడుతున్నది చాలా కాలంగా..! ఏదో ఒక వ్యక్తి మీద వ్యాసం రాసినప్పుడూ ఆ వ్యక్తి మీద ఉన్న ఆరోపణలు కామెంట్ రూపంలో రాస్తే.. సదరు ఆ వ్యక్తి అంటే అభిమానమో లేక భక్తి వున్న మనసులు వచ్చి..వ్యాసంతో సంబందంలేని మరోకరిని తీసుకొచ్చి..కంపారిజన్ అంటే పోల్చి వాళ్ల కంటే ఆయన బెటర్ కదా..? అనే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు..ఇంతకంటే దౌర్బాగ్య స్థితి ఎక్కడా వుండదు..బహుశ వాళ్లు పెరిగిన విదానం అటువంటిదేమో..!
@శ్రీకర్..గారు మీరు ఉదహరించిన వ్యక్తులతో పోల్చినప్పుడూ బాబా గారి ఆకృత్యాలు తక్కువ కాబట్టి.. ఆయన ఏమి చేసినా సమర్థిస్తారన్న మాట..?? చాలా బాగుంది..గుడ్డిలో కన్న మెల్ల మేలనే రకం అన్నమాట.. అలాగయితే వై.ఎస్ కన్న చంద్రబాబు తక్కువ దోచుకున్నారు కాబట్టి...( ఈ పోలిక కూడ మీ నుండి స్పూర్తి పొందినదే సుమా) చంద్రబాబు కాస్త తక్కువ మంచోడు అని అనుకుందామా..?. అక్కడ ఎక్కడో గోవాలో జరుతుంది కాబట్టి.. దానితో పోల్చుకుంటే మన బాబా గారి చేసింది ఏమంత ప్రమాదం కాదు అన్న రాజీధోరణి మీకున్నదేమో గాని మాలాంటి వారికి ఉండదు.. ! అయినా మీరు ఉదహరించిన గోవా సంగతే చూడండి వారేమి తాము దేవుల్లమని చెప్పుకుంటూ మనుషుల బలహీనతలమీద దెబ్బ కోటట్లేదు కదా..? మీరు చెప్పిన వారంత సంఘ విద్రోహులే.. మీ పోలికేంటో ..? అర్థమే కావట్లేదు. తప్పు గోవాలో జరిగినా అమెరికాలో జరిగినా పక్క రాష్ట్రంలో జరిగినా ఎవరు చేసినా.. బాబాలాంటి వారు చేసినా అది తప్పు తప్పే..! అంతే కాని చేసిన తప్పులులో మంచితప్పులు..చెడ్డతప్పులు అంటూ విడదీసి వారికంటే ఈయన బెట్టర్ కదా లేక ఈయనకంటే ఆయన బెట్టర్ కదా అని భుజాల మీద ఎక్కించుకుంటారా..? వయసులో ఉన్నప్పుడూ కన్ను మిన్ను కానరాకుండా చేసి..తర్వాత జవసవత్వాలు ఉడిగాక ఇక చేయడానికి ఎలాంటి ఆకృత్యాలు ఏమి మిగలేననప్పుడు అంత వరకు చేసిన " ఘనకార్యాల" మరిపించడానికి చేసే తాయలలాలే నీటిపథకాలు.. మిగతా ధార్మిక పథకాలు..! మరదే ఆయన నవ యవ్వన వయసులో ఎందుకు చేయలేకపోయారు..? అప్పుడూ కన్ను మిన్ను కానరాలేదు..! ముదసలి వయసులో అన్ని ఉడిగిపోయుంటాయి కదా..? అప్పుడూ గుర్తుకొస్తుంది కీర్తి.. ప్రతిష్టల మీద యావ..! దానికి తార్కానమే ఆ పథకాలు..! ఉన్న ఒక్క తమ్ముడూ జానకీరామ్ తను చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకొని మరణించాడు..వారసులు ఎవరూ లేరు..!ఇక అన్ని వేల కోట్ల ఉండి ఆయనొక్కరు ఏమి చేసుకుంటారు..? అదేదో ముదసలి వయసులో చేస్తే అంతవరకు చేసిన పాపాలు కనపడకుండా పోతాయనీ..! అంటే మీలా మాట్లాడవాళ్లను సంపాదించుకోవచ్చు కదా..? మొత్తానికి బాబా ఆ విషయంలో బాగానే విజయం సాదించారనిపిస్తుంది మీలాంటి వారి కామెంట్స్ చూసాక. కనీసం ఈ కంపారిజన్స్ మానేయండి..ఇప్పటికైనా. ఇలాంటివి ఉండబట్టే..ఎవరికి వాళ్లు తమ తమ ఆరాధ్య దైవాలనుకొనే వారితో మరికర్ని పోల్చి ఆయన కంటే ఈయన బెటర్ కదా అని ..నెత్తిమీద పెట్టుకొని పూజించి లేక సమర్థించడం వలన సమాజాంలో మరొక తప్పుచేసే మనుషులు అవర్భించడానికి కారణమవుతున్నారు.

చెప్పారు...

అపరిచితుడులో ఇలాంటిదే చెపుతాడు. ఐదు పిసలు ఐదుగుర, ఐదు లక్షలు..

ఇక్కడ చిన్న దొంగను పట్టుకుంటే ఎవడో దొంగతనం చేస్తున్నాడు వాడిని పట్టుకోలేదేంటి అని...

ఎవడో గోవాలో మోసం చేస్తున్నాడు వాడిని పట్టుకోలేదు..
నక్సల్స్ ఏదో చేస్తున్నారు వాళ్ళని ఏమి అనటదు.. ప్రతి నక్సల్ కోసం ఒక బుల్లెట్ తయరయ్యి ఉంటుంది అది వాళ్ళకు తెలుసు.

అందరు ఇస్తున్నారు కదా అని లంచాలు న్యాయ మయినావు కాదు.

అందరు రోడ్డు మీద మూత్రం పోస్తున్నారు కదా అని అది మంచిది కాదు.

అందరు బాబాలకు మొక్కారు కదా అని బాబాలు దేముడు కారు. అలా దేముడు అని మనం mass histeria తయారు చేస్తున్నాము.

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత గారు,
నేను చెప్పె కోణం లో నుంచి చూడండి. ఇక్కడ రాసే వారు కాని, నేను కాని ఆయన దేవుడని నమ్మేవాళ్లం కాము. ఆయనని దేవుడు అనుకొనే వారిని,ఫాలోయర్స్ ని మనం మార్చలేము. కనీసం అటువంటి వారిని మన వాదనతో ఓడించలేము కూడా. వాదనలోకి దిగితే నేను ఆయన దేవుడని నమ్ముతున్నాను నా యిష్టం అని నువ్వేవరు చెప్పటానికి అని అంటె మనం చేసేది కూడా ఎమీలేదు.
-------------------
ఇక పొతే ఇటువంటి వారితో మనకు (సాధారణ పౌరులకు ) ఉన్న సంబంధం ఎమీటంటె వారి వలన సమాజానికి ఎంత లాభం,ఉపయోగం జరిగిందని లేక వారి మాయలు మంత్రాలతో ఎంత నష్టం కలిగించారని మాత్రమే మనం చూస్తాము. అంతే కాని ఆయనకి మనలా రోగం వచ్చింది, జుట్టు నరిసింది అని చూడటం మన క్యురియాసిటి మాత్రమే. యేసు ప్రభువు ,బుద్ద భగ వానులు కూడా చనిపోయారు కదా!
----------------------
ఆయన దేవుడుగా అవతారమేత్తి భక్త బృందం తో తన బ్రాండ్ క్రీయేట్ చేసుకొనే పరిణామం లో ఆయన రాయలసీమ / దేశ సంస్కృతిని ఎమైనా మార్చాడా అని పరిశిలిస్తే ఆయన అవేమి చేయలేదు. పోని బాబా గారు ప్రత్యేకం గా ఒక టీం ని ఏర్పాటు చేసి మీడీయా ద్వార తనని దేవుడిగా పోగిడించుకొన్నట్లు నేను వినలేదు. ఆయన కి ఆ పేరు వచ్చిన రోజుల్లో మీడీయా ప్రభావం పెద్దగా ఉండేది కాదు. ఇక ఇప్పటి వరకు ఎవ్వరు ఆ సంస్థ ప్రతినిధులమని వచ్చి మీడీయా షోలలో పెద్దగా పాల్గొనలేదు. ఆయన దేవుడుగా అవతారమెత్తి భక్త బృందం తో సమాజం లో ఎమైనా సంస్కృతి పరంగా మార్పులు తెచ్చాడా అనే విషయం పైనే చర్చించాల్సింది. ఎందుకంటే దైవం పేరు తో ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రీయేట్ చేసేటప్పుడు పాత సంస్కృతిని మార్చకుండా చేయటం సాధ్యం కాదు కదా! నాకు తెలిసి ఆయన స్థానిక సంస్కృతిని ఎమీ మార్చలేదు. ఇంకా చెప్పాలి అంటె అక్కడ ఆయన పెద్ద పాపులర్ కాదు. రాయలసీమ వారికి ఆయనను నమ్మినా, నమ్మకపోయినా అందరికీ తన సంస్థ ద్వారా నీళ్ళు ,సుపర్ స్పేషాలిటి ఆసుపత్రి సేవలు "సకాలం" లో ఏర్పాటు చేశారు. ఆయన చేసిన పనులను ప్రభుత్వం చేపట్టి ఉంటే అవి ఎప్పటికి పూర్తి అయ్యేవో గాని,ఇతనికి ఉన్న దేవుడి ఇమేజ్ వలన/ నమ్మకం వలన అన్ని కంపేనీల వారు స్వలాభాపేక్షను తగ్గించుకొని ప్రణాళిక ప్రకారం అనుకొన్న సమయం లో పూర్తి చేశారు. ఇదే పనిని మన ప్రభుత్వాలు చేపడితే మరో తెలుగుగంగ లాగా
అయిఉండేదని నా అభిప్రాయం.
----------------------
ఒక సాధారణ పౌరుడిగా మనం ఎవరి ద్వారా ఎంత లాభం పొందాము అని ఆలోచిస్తే ప్రభుత్వాలు అభివృద్ది పేరుతో చేసె అభివృద్దికి గోవా ఒక ఉదాహరణగా ఇచ్చాను. ఇక ఆంధ్రా, తమీళ నాడు సంగతి అందరికి తెలుసు కదా! రాజ్యాం, దాని దోపిడిని అడ్డుకోవాలని ప్రయంత్నిచే మావోయిస్టులు మరి చేస్తున్నదేమిటి? వీరందరి తో పోల్చుకొన్నపుడు ఆయన తక్కువ నష్టం తో ఎక్కువ ఉపయోగకరమైన పనులుచేసాడని ఒక సాధారణ పౌరుడిగా నా అభిప్రాయం. ఆయన దేవుడో, కాడో, అసలో నకీలీనో ఇటువంటివి నాకు అనవసరం. మరి ఇటువంటి వ్యక్తిని మనం అంతా చాలా చాలా మంచి వారమైనట్లు ఆయన వ్యక్తిత్వం మాత్రం అనుమానించ దగైనదిగా చాలా బ్లాగులో రాస్తూ ఉండటం వలన నేను ఈ వ్యాఖ్యలు రాశాను. ఇంత క్రితం చెప్పిన విధంగా ఆయన చెసిన ఘనకార్యాలు ఒకవేళ నిజమనుకొన్నా ఆయన సమాజం లో అందరిలాగా ఒక ఎదో ఒక లోపం ఉన్న సాదాసీదా మనిషే కదా!

కమల్ చెప్పారు...

ఇక్కడ వున్న కామెంట్స్ చూస్తే ఈ వాదనలకు అంతు ఉండదు అనిపిస్తున్నది.! ఆల్ రెడి ఒక ఫిక్సడ్ అభిప్రాయంతో వున్నారు ఎన్ని చెప్పినా వారు ఏర్పరుచుకున్న అభిప్రాయాన్ని సమర్థించడానికి వాటి చుట్టూ వాదనలు సృష్టించుకుంటారు..అందులో భాగమే "పోల్చడాలు " ఒక రకంగా దానిని పలాయన వాదం అని కూడ చెప్పోచ్చు..! మళ్లీ ఇక్కడ తక్కువ తప్పులు..ఎక్కువ తప్పులంటూ విడదీయడాలు..!ఈ వైఖరి మారదు..హు!. అందర్నీ ఒకే వరసులో నించోబెట్టాలి అంతె.

అజ్ఞాత చెప్పారు...

@కమల్,
నేను బాబా గారి భక్తుడిని కాను.ఆయ్న ఉపన్యాసాలను వినలేదు. నేను ఆయన గురించి లాభ నష్టాల గురించి కోణంలో మాత్రమే చూడటం జరిగింది. ఆయన గురించి మీరు రాసిన స్కాంలు గురించి నాకు పెద్దగా తెలియవు. అందువలననే మీలాంటి వారి వాదన పూర్తి అబ్బదంగా కొట్టిపారేయకుండా నాకోణం (లాభ నష్టాల్ల ) లో చెప్పాను.
----------------------
*అన్న రాజీధోరణి మీకున్నదేమో గాని మాలాంటి వారికి ఉండదు.. !*
మీరు పైన చెప్పినవి నిజంగా నమ్మితే అది చట్ట ప్రకారం నిరూపిస్తే అంతకన్నా ఎమీ కావాలి? నేను ఇక్కడ చట్టం అనేది ఎందుకు రాస్తున్నాను అంటె ఈ రోజుల్లో ఎది నిజమో ఎది అబద్దమో గందరగోళ పరిస్థి ఎర్పడింది, కనుక న్యాయ న్యాయాలను తెల్చవలసినది కోర్టే కదా! అంతేకాని ఇలా రాసి మిమ్మల్నివాదనలో ఇరుకున పెట్టటానికి మాత్రం కాదు. ముఖ్యం గా నేను ఆయన ఫాలోయర్ని కాదు కనుక ఆయనకు మద్దతు గా మాట్లాడటం జరగదు. అందువలన నేను ఇంతకు మించి ఈ విషయమై ఎమీ చెప్పలేను.
----------------
ప్రకృతిలో పెద్ద దేవుడి అవతారమైనా చిన్న చీమ ఐనా చని పోవలసిందే. ప్రకృతి పరంగా చూస్తే మనం అనుకునే ఏదేవుడు కూడాను ప్రకృతి దృష్ట్టీలో యక్స్ ట్రాడినరీ ఐతే కాదు. దానికి బాబా ఎమీ అతీతులు కాదు.

కమల్ చెప్పారు...

@శ్రీకర్ గారు. "మీరు పైన చెప్పినవి నిజంగా నమ్మితే అది చట్ట ప్రకారం నిరూపిస్తే అంతకన్నా ఎమీ కావాలి? " ఈ మీ వ్యాక్యాలకు. నిరూపణలు నా వద్ద లేవు..ఉన్న ఒకరిద్దరని చంపేసారు..93లో వారి ఆశ్రమంలోనే. బెంగళూర్‌లో మారూంకు కొద్ది దూరంలో ఉన్న మరో రూంలో వుండే వారు ఆ చంపబడిన వారు.
నేను మొదట ఇచ్చిన కామెంట్‌లోనే ఒకరి పేరు ప్రస్తావించాను ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నారు..ఆయన్ని కలిస్తే అన్ని నిజాలు తెలుస్తాయి. ఇంతకంటే నేనెక్కువ చెప్పలేను..చెప్పి నామీద అనవసరపు గొడవలు తెచ్చుకోవడం నాకిష్టం లేదు.

రాజేష్ జి చెప్పారు...

ఇక్కడ వున్న కామెంట్స్ చూస్తే నాక్కూడా!
"
ప్రజలసొమ్ము తినే
రాజకీయ రాక్షసుల గుండెల్లో
దింపలేని కుజాతి మీది

రాజకీయ నాయకులను
నిలదీయలేని దైన్యత్వం మీది
అవినీతిమీద పోరాటం చేయలేని
పిరికితనం మీది
"

తీరిగ్గా బాబాల మీన కూర్చుని ఏడుద్దాం రా తంబీ! నవయుగానికి ఆహ్వానం పలుకుదా౦.

అజ్ఞాత చెప్పారు...

*అపరిచితుడులో ఇలాంటిదే చెపుతాడు. ఐదు పిసలు ఐదుగుర, ఐదు లక్షలు*
శంకర్ గారు చెప్పింది మీకు చాలా నచ్చినట్టు ఉంది. మీరు సరిగా గమనిచారోలేదొ శంకర్ తీసే సినిమాలన్ని దేశం బాగుండాలి, అవినీతిని పెకలించి వేయాలి అనే కాన్సేప్ట్టు మీదే ఉంటాయి. ఒకప్పుడు టి. కృష్ణ అనే దర్శకుడు అతి తక్కువ ఖర్చుతో ఇదే కాన్సేప్ట్స్ తో ఎఫ్ఫేక్టివ్ గా అద్బుతమైన సినేమాలు తీశాడు. కాని ఇప్పుడు అటువంటి వారిని అందరూ మరచి పోయారు. కాని రోజువారి జీవితంలో అడుగడుగునా కనిపించే అవినీతి గురించి శంకర్ అన్ని కోట్లు ఖర్చు పెడితే గాని ప్రజలు సినేమాగా చూడటం లేదు. అవినితి పోవాలని అనే కాన్సేప్ట్ పై ఇంత గొప్ప భారి బడ్జేట్ సినేమాలు తీసే శంకర్ గారి సినేమా పెట్టుబడి అంత తెల్లధనమేనా? రోబో సినేమాకి 100+ కోట్ల పెట్టుబడి తెల్లధనం తో తీసినదా అని ఆలోచించారా?

Rao S Lakkaraju చెప్పారు...

తీరిగ్గా బాబాల మీన కూర్చుని ఏడుద్దాం రా తంబీ! నవయుగానికి ఆహ్వానం పలుకుదా౦.
----
రాజేష్ జీ good one.

అజ్ఞాత చెప్పారు...

...బాబా గారి గురించి నిజాలు తెలుసుకోవాలంటే ..రిటైర్ అయిన వీరనారాయణరెడ్డి గారిని కలిస్తే, పుట్టపర్తి.. అక్కడి చీకటి కోణాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నారు బంజార హిల్స్‌లో...

Having known so much, what he did as a top ranking officer? Was he collecting his maamool by sending call girls to puttaparti?

After retirement, he is opening-up and gossiping as he is no more in their pay-list?

అజ్ఞాత చెప్పారు...

హ్మ్:) చర్చ చాలా బాగుంది. శ్రీకర్, కమల్, మరో అఙ్నాత బాగా వాదించారు.
కాకపోతే ఇవన్నీ మామూలు టైం లో అయితే సమయోచితమేమో కానీ ఒక వ్యక్తి మరణ శయ్యపై ఉన్నప్పుడు ఇలా చర్చించడం సబబు కాదేమో? ఒక వ్యక్తిని చనిపోయాక/మరణశయ్యపై ఉన్నప్పుడు (కనీసం కొద్ది కాలంవరకూ)అతని చెడుకన్నా మంచిగురించే మాట్లాడుకోవడం మన సాంప్రదాయం. ఇలాంటివి ఇంతకు ముందో, లేక మరికొన్ని రోజుల తరువాతనో మాట్లాడుకుంటే మంచిదేమో?

Praveen Mandangi చెప్పారు...

తలాతోకా లేని ఆర్గ్యుమెంట్లు చెయ్యకు. కార్మిక విప్లవం కోసం పోరాడే మావోయిస్టులకి హుండీల వ్యాపారం చేసే బాబాలతో పోలిక ఏమిటి? ఉద్యమంలో ఎన్ని తప్పులు జరిగాయి వంటి విషయాలు ఇక్కడ అనవసరం. వాళ్లు ఏ పని చేసినా హుండీల వ్యాపారం చేసేవాళ్లతో వాళ్లకి పోలిక ఉండదు. ఒకడు ఎక్కువ డబ్బులు భోంచేశాడు, ఇంకొకడు తక్కువ డబ్బులు భోంచేశాడు అనడం ఇక్కడ అప్రస్తుతమైన పోలికలు. ఇందాక ఎవరో చెప్పినట్టు చంద్రబాబు టైమ్‍లో ప్రపంచ బ్యాంక్ డెబిట్ డబ్బై వేల కోట్లు ఉండేది, వయ్యెస్సార్ టైమ్‍లో ఆ డెబిట్ లక్ష కోట్లు దాటింది కనుక చంద్రబాబే ఉత్తముడు అని వాదించినట్టు ఉంది.

అజ్ఞాత చెప్పారు...

*కార్మిక విప్లవం కోసం పోరాడే మావోయిస్టులకి హుండీల వ్యాపారం చేసే బాబాలతో పోలిక ఏమిటి?*
ఎక్కడ వున్నావూ ప్రవీణ్? ఈ రోజుల్లో కార్మికులు అనే పదం తీసివేసి యక్సిక్యుటివ్ అనే పదం ప్రవేశపెట్టారు. అది నీకు తెలుసో లేదొ. యక్సిక్యుటివ్ ల కు కార్మికుల ఇచ్చే జీతం ఇస్తారు. వారికి ప్రత్యేక హక్కులు ఉండవు. ఎందుకంటే ప్రతి యక్సిక్యుటివ్ మేనేజ్మెంట్ లో భాగం కావున వారు బాధ్యతలు తీసుకొని వ్యాపారసంస్థ లాభాల కొరకు పని చేయాలి. హక్కులు అని ఊరకనే పోరాడితే ఉండె ఉద్యోగం కూడా ఉండదు. పాత ముక్కి పోయిన 100 సం క్రితం పుస్తకాలు చదివి వాగమాక. కారల్ మార్క్స్, మావో ల కే కాదు బుర్ర ప్రపంచం లో ఎందరికో ఉంది.
----------------------------------
నాకు తెలియక అడుగుతాను బాబాని తెగ విమర్సిస్తున్నావే హుండిల వ్యాపారం అని. మరి కారల్ మార్క్స్ గారు ఇంట్లో పని మనిషికి కడుపు చేసి కొడుకును కన్నాడు గదా? దాని గురించి పెద్దగా ఎవరు మాట్లాడరెందుకు. ఆయన దగ్గరే పైసా ఉండేది కాదు ఖాళీ గా ఇంట్లో కూచోలేక పనిమనిషి కి కడుపు చేయటం అది ఎంతో ప్రేమించి పెళ్ళిచేసుకొన్న పెళ్ళాం దగర వున్నప్పుడే.
---------------------------
*వాళ్లు ఏ పని చేసినా హుండీల వ్యాపారం చేసేవాళ్లతో వాళ్లకి పోలిక ఉండదు. *
వారికి హుండి ఎందుకు చర్చ్ వుందిగదా డబ్బులు ఇవ్వడానికి. లేక పోతే అగ్ర రాజ్యాలు ఇస్తాయి. వారి గురించి నీకు పూర్తిగా తెలియక మాట్లాడుతున్నావు మార్థాండా!

Praveen Mandangi చెప్పారు...

మా జిల్లాలోని ఒక బీవరేజెస్ ఫాక్టరీలో పని చేసే కార్మికులు రోడ్డు మీదకి ఎక్కి పోరాటాలు చేస్తేనే జీతం 3000 నుంచి 3500కి పెరిగింది. కార్మికులు ఎక్సెక్యూటివ్‍లు ఎక్కడ అయ్యారు?

అజ్ఞాత చెప్పారు...

అదేమీ వింతోగాని ప్రవీణ్ శరం గారి జిల్లా చుట్టుపక్కలే చాలా అతిశాయోక్తులు జరుగుతాయి

Praveen Mandangi చెప్పారు...

దోచుకుని లాభాలు మిగిల్చుకోవడానికి ఏ జిల్లా అయితేనేం కానీ నువ్వు రమణి స్టైల్ కాపీ కొట్టావని తెలుసు. ఓసారి ఆమె ఫేస్ చూడు, గుర్తొస్తుంది. facebook.com/people/Ramani-Rachapudi/100000197196584

అజ్ఞాత చెప్పారు...

vallavi veellavi links paste chestaavme raa nelatakkuva mundaa kodakaa

Praveen Mandangi చెప్పారు...

https://profiles.google.com/praveenmandangi/posts/bZK8VjjNNJD